బిజెపి బాటలోనే కాంగ్రెస్ ఆట

అదే ఆట…అదే ఆటస్ధలం…ఆటగాళ్ళే అటూ ఇటూ మారారు…మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఇది మౌనముని నరేంద్రమోదీ సాక్షిగా రచ్చగా మారిపోయిన చర్చల పార్లమెంటు. 2జి స్పెక్ట్రమ్‌‍మీద జాయింట్ పార్లమెంటరీ వేయాలని పట్టుబట్టిన బిజెపి 2011లో పార్లమెంటు శీతాకాలపు సమావేశాల్ని ఒక్కరోజు కూడా జరగనివ్వలేదు. నాలుగేళ్ళ తరువాత వర్షాకాలపు సమావేశాల్లో ఇపుడు కాంగ్రెస్ అదేపని చేస్తోంది. ఎవరెంతచెప్పినా సుష్మా, వసుంధర, చౌహాన్ లు రాజీనామా చేయరని పార్లమెంటు సమావేశాలకు ముందుగానే ప్రధాని ప్రకటించేసి చేతులు కట్టుకుని కూర్చున్నారు.

ఐదురోజులపాటు సస్పెండయిన కాంగ్రెస్ ఎంపీలకు సంఘీభావంగా తామూ సభకు వెళ్ళేది లేదని 9 ప్రతిపక్షాలూ ప్రకటించడం కాంగ్రెస్ నైతిక బలాన్ని పెంచింది. సభనియమనిబంధనలను తాను రాయలేదని ఎప్పటినుంచో వున్నవాటినే అమలు చేస్తున్నానని స్పీకర్ చర్యను సమర్ధించుకుంటే, సభను నడవనీయకపోవడం తానుపెట్టిన సాంప్రదాయం కాదని, ”రాజీనామాలే ముందు, ఆతరువాతే మాటలు” అని ప్రభోధించింది బిజెపి యేనని సోనియా దెప్పిపొడిచారు.

చట్టసభలో బాధ్యతా యుతమైన చర్చలకంటే, రెండునెలల్లో బీహార్ ఎన్నికలు జరుగుతూండగా మెట్టుదిగినట్టు కనిపించకపోవడమే పాలక, ప్రతిపక్షాలకు ముఖ్యం. సభను సజావుగా సాగనివ్వండి ప్రధానే సమాధానం చెబుతారు అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సంప్రదించినా సోనియా ససేమిరా అన్నారంటే తాడు తెగిపోయినా సరే సాగలాగడమే కాంగ్రెస్ ధోరణిగా స్పష్టమైంది.

అధికార దుర్వినియోగానికి , ఆశ్రిత పక్షపాతానికి మించి నిందితుడైన లలిత్ మోడీని విదేశీపర్యటనకు అనుమతించవలసిందిగా మరొకదేశాన్ని ఒక కేంద్రమంత్రి స్వయంగా కోరి దేశం పరువుప్రతిష్ఠలను దిగజార్చిన అంశం. అందుకు పాల్పడిన విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ”నేనేమీతప్పుచేయలేదని” పొడిపొడిగా సమాధానంచెప్పి తప్పుకోవడానికి సడలని కాంగ్రెస్ పట్టే కారణమైతే, రాజీనామాలే ముందు, ఆతరువాతే మాటలు అనే ఎత్తుగడను అప్పట్లోనే అమలు చేసిన బిజెపి యే మార్గదర్శి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close