తుని ఘటనలపై వైకాపా ప్రత్యారోపణలు

నిన్న తునిలో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై వైకాపా తీవ్రంగా ప్రతిస్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, “ప్రశాంతంగా మొదలయిన కాపు ఉద్యమాన్ని చెడగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కొన్ని అసాంఘిక శక్తులని సభలో ప్రవేశపెట్టి ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చివేశారు. ఇందుకు ఆయనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. ఎక్కడ ఏమి జరిగినా ఆయనకు జగన్మోహన్ రెడ్డిని నిందించడం అలవాటయిపోయింది. ఎన్నికల సమయంలో కాపుల సంక్షేమం కోసం వెయ్యి కోట్లు ఇస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా డబ్బులు లేవని సాకు చెపుతూ కేవలం వంద కోట్లు కేటాయించడం వారిని మోసం చేయడమే. పుష్కరాలు, పట్టిసీమ, చంద్రన్న కానుక అంటూ వందల కోట్లు వృధా చేసిన చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీని అమలు చేయడానికి మాత్రం డబ్బులులేవని చెపుతున్నారు. కాపులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రితో సహా మంత్రులు అందరూ వారిని మరింత రెచ్చగొట్టే విధంగానే మాట్లాడారు తప్ప ఎవరూ వారిని అనునయించే ప్రయత్నం చేయలేదు. ఆ కారణంగా వారిలో అసంతృప్తి పెరిగి ఈ ఉద్యమానికి దారి తీసింది. దానిని భగ్నం చేసేందుకే చంద్రబాబు నాయుడు అసాంఘిక శక్తులను ప్రవేశపెట్టి హింసాత్మక ఘటనలకు జరిగేందుకు కారకులయ్యారు. కనుక దానికి ఆయనే పూర్తి బాధ్యత వహించాలి. తునిలో నిన్న జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరం,”అని అన్నారు.

వైకాపాలోని మరో సీనియర్ అంబటి రాంబాబు కూడా ఇంచుమించు అదేవిధంగా మట్లాడారు కానీ నిన్న జరిగిన అల్లర్లలో ప్రభుత్వమే అసాంఘిక శక్తులను ప్రవేశపెట్టినట్లు ఆరోపించలేదు. ప్రశాంతమయిన తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా చిచ్చు పెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించినందున, అంబటి రాంబాబు అదే కోణంలో జవాబిచ్చారు.

“వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడిన ఉభయగోదావరి జిల్లాల ప్రజలలో ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. దానిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే అది ఈవిధంగా బయటపడింది. ఈ ఘటనలకు తమ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, వైఖరే కారణమని గ్రహించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి మాపై ఆరోపణలు చేయడం చాలా విస్మయం కలిగిస్తోంది. కాపు ఉద్యమాన్ని రాజకీయం చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు.దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఉద్యమంలో ఇటువంటి సంఘటనలు జరగడం మంచిది కాదు కనుక అందరినీ సంయమనం పాటించమని కోరుతున్నాము,” అని అంబటి రాంబాబు అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close