గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఇక లోకలే..! ఆ విమానం ఇక రాదు.. పోదు..!

గన్నవరం నిమానాశ్రయం నుంచి ఉన్న ఒకే ఒక్క అంతర్జాతీయ విమానసర్వీస్ రద్దయిపోయింది. వయబిలిటి గ్యాప్ ఫండింగ్ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు ఏపీ సర్కార్ అంగీకరించకపోవడంతో… ఇండిగో సర్వీసుల్ని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. దీంతో… మొదటగా.. ఒక్కటితో ప్రారంభించి.. గన్నవరం నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు పెంచాలనుకున్న లక్ష్యానికి గండి పడింది.

గన్నవరం ఎయిర్ పోర్ట్ కు 2017 మే 3వ తేదీన కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా కల్పించింది. కానీ ఒక్క సర్వీసును కూడా ప్రారంభించలేదు. ఏపీ సర్కార్ వయబిలిటీ గ్యాప్ విధానంతో ముందుకొచ్చి టెండర్లను పిలిచింది. ఈ టెండర్లలో సింగపూర్ సర్వీస్ నడిపేందుకు ఇండిగో ముందుకొచ్చింది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో 50 శాతంకంటే తక్కువ సీటింగ్ కు టిక్కెట్లు బుక్ అయితే.. ఒక్కోసీటు కింద ఇంత అని టికెట్ ధర ఇండిగో సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. 50 శాతంకంటే ఎక్కువ ఉంటే అవసరం ఉండదు. ఈ విధానంలో భాగంగా ఇండిగో సంస్థ 180 మంది సీటింగ్ ఉన్న ఇండిగో విమానాన్ని నడపడం ప్రారంభించింది.

అయితే… సింగపూర్ – విజయవాడ విమానానికి ఆదరణ బాగుంది. ఒక్క రూపాయి కూడా.. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ చేయాల్సిన అవసరం సర్కారుకు రాలేదు. ఆక్యూపెన్సీ 90 నుంచి వంద శాతం వరకూ ఉంది. అయితే.. ఈ సర్వీసుకు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం జూన్ 31వ తేదీతో ముగుస్తుంది. ఒప్పందం కొనసాగించడానికి ఏపీ సర్కార్ ఆసక్తి వ్యక్తం చేయలేదు. ఇప్పటి వరకూ.. అవసరం రాలేదు కదా.. ఇక ఒప్పందం ఎందుకన్నట్లుగా.. ఇండిగోతో… మాట్లాడటంతో.. ఆ సంస్థ .. సర్వీస్ ఆలోచన విరమించుకుంది. తన సర్వీసును శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే నెల 2వ తేదీ వరకు ఆన్ లైన్ బుకింగ్ ఉండటంతో ఈ ప్రయాణికుల్ని వేరే సర్వీసుల్లోకి సర్దుబాటు చేయాలని తమ సిబ్బందిని ఆదేశించింది. చివరి సర్వీసులో సింగపూర్ విమానంలో 162 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రభుత్వం స్మూత్‌గా డీల్ చేస్తే అయిపోయేదానికి.. కఠినంగా వ్యవహరించడంతో.. గన్నవరం మళ్లీ లోకల్ అయిపోయినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close