టీమ్ ఇండియాని ముంచేసిన వాన‌: సెమీస్ లో ఓట‌మి

భారత క్రికెట్ అభిమానులకు ఇది చేదువార్తే. టైటిల్ ఫేవ‌రెట్ల‌లో ఒక‌టిగా బ‌రిలోకి దిగిన భార‌త్‌.. సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయి ఇంటి ముఖం ప‌ట్టింది. 240 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యానికి 18 ప‌రుగుల దూరంలో నిలిచిపోయింది. జ‌డేజా (77), ధోని (50) పోరాడినా ఫ‌లితం లేక‌పోయింది. ఈ రెండు వికెట్లు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో కోల్పోవ‌డం వ‌ల్ల భార‌త్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. అంత‌కు ముందు టాప్ ఆర్డ‌ర్ కుప్ప కూల‌డంతో 90 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో సెంచ‌రీ భాగ‌స్వామ్యంతో భార‌త అభిమానుల్లో ఆశ‌లు చిగురింప‌జేశారు ధోనీ, జ‌డేజా. కానీ సాధించాల్సిన ర‌న్ రేట్ పెరిగిపోవ‌డంతో ధోని, జ‌డేజాల‌పై ఒత్తిడి పెరిగింది. వేగంగా ప‌రుగులు చేయాల‌న్న ఉద్దేశంతో వికెట్లు పారేసుకున్నారు. 49వ ఓవ‌ర్లో ధోనీ ర‌నౌట్ అవ్వ‌డంతో మ్యాచ్ ముగిసింది.

నిజానికి 240 ప‌రుగుల ల‌క్ష్యం పెద్ద‌దేమీ కాదు. భార‌త జ‌ట్టులో భీక‌ర‌మైన బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. ఓపెన‌ర్ల‌తో స‌హా కోహ్లీ ఫామ్‌లో ఉన్నారు. దాంతో భార‌త్ సునాయాసంగానే ల‌క్ష్యాన్ని చేరుకుంటుంద‌నిపించింది. అయితే ఓపెన‌ర్లు త‌క్కువ స్కోరుకే వెనుదిర‌గ‌డం, కీల‌క‌మైన మ్యాచ్‌లో కోహ్లి చేతులు ఎత్తేయ‌డంతో.. భార‌త్ క‌ష్టాల్లో ప‌డింది. మంగ‌ళ‌వారం జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా బుధ‌వారానికి వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. వ‌ర్షం వ‌ల్ల పిచ్ బౌలింగ్‌కి అనుకూలంగా మారింది. ఔల్ట్ ఫీల్డ్ కూడా వేగంగా లేదు. దాంతో ప‌రుగులు రావ‌డం క‌ష్ట‌మైంది. నిజంగా బుధ‌వార‌మే మ్యాచ్ ముగిసిన‌ట్టైతే, భార‌త్‌కు ఛేద‌న పెద్ద స‌మ‌స్య అయ్యేది కాదు. పిచ్ ఓర‌కంగా దెబ్బ‌తీస్తే… భార‌త బ్యాట్స్‌మెన్ వైఫ‌ల్యం మరింత కృంగ‌దీసింది. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న పంత్‌, కార్తీక్‌, పాండ్య‌… త‌క్కువ స్కోర్ల‌కే వెనుదిరిగారు. జ‌డేజా భారీ షాట్ల‌తో అల‌రించి,స్కోరు బోర్డుని ప‌రుగులు పెట్టించాడు కాబ‌ట్టి స‌రిపోయింది, లేదంటే భార‌త్ మ‌రింత భారీ తేడాతో ఓడిపోయేదే. మొత్తానికి న్యూజీలాండ్ ఫైన‌ల్లో అడుగుపెట్ట‌గ‌లిగింది. గురువారం ఆస్ట్రేలియా – ఇంగ్లండ్‌ల మ‌ధ్య రెండో సెమీస్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close