ఇన్‌కంట్యాక్స్ : శ్లాబులు పెరిగాయి సరే.. మరి పన్ను తగ్గిందా..?

వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు నిర్మలమ్మ తనదైన శైలిలో ఆనందం కలిగించారు. ఎంతో పెద్ద ఊరట కల్పిస్తున్నట్లుగా ఘనంగా చెప్పారు. సొంత పార్టీ సభ్యులు … బల్లలు చరుస్తూండగా మినహాయింపులు ప్రకటించారు. అహో.. ఓహో అనుకుని.. లెక్కలు వేసుకున్న వేతన జీవులు… ఊసూరుమనక తప్పలేదు. ఎందుకంటే.. అధిక వేతనం అందే వారికి మాత్రమే కాస్త ఊరట లభించింది. ఓ మాదిరి వేతనం ఉన్న వారికి.. ఎలాంటి మినహాయింపులు లభించలేదు. గతంలో మాదిరిగా రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చారు. అయితే.. ఇక్కడా ట్విస్ట్ పెట్టారు. రెండు రకాల ఆప్షన్లు ఇచ్చారు. పాత విధానం కింద.. రెండున్నర లక్షల వరకూ మినహాయింపు.. ఐదు లక్షల వరకూ స్టాండర్డ్ డిడక్షన్… ఉంటుంది. ఇక 80సీ కింద మినహాయింపులు ఉండనే ఉంటాయి.

అయితే ఇప్పుడు.. ఐదు లక్షల వరకూ మినహాయింపు ఆప్షన్ ఎంచుకుంటే… 80సీ మినహాయింపులేమీ ఉండవు. అంటే.. ఐదు లక్షలకు మించి.. ఎంత ఆదాయం వచ్చినా పది శాతం పన్ను కేటగిరిలోకి చేరిపోతారు. రూ.5 లక్షల నుంచి 7.5లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతం పన్ను , రూ.7.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15 శాతం , రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20 శాతం , 12.5 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం, రూ.15 లక్షలకుపైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. గతంలో.. కంటే.. ఓ ఐదు సాతం వరకూ తగ్గించారు. అంటే.. అధికా ఆదాయం ఉన్న వారికి కాస్త వెసులుబాటు ఉన్నట్లు అయింది.

పన్ను చెల్లింపుదారులు కొత్త లేదా పాత శ్లాబ్ ఎంచుకునే అవకాశం కల్పించింది. కొత్త శ్లాబ్ ఎంచుకుంటే 80(సి) కింద ప్రయోజనాలు ఉండవు. కొత్తవిధానాన్ని ఎంచుకుంటే ఎన్ని బీమాలు చేయించుకున్నా.. పన్ను మినహాయింపు రాదు. మొత్తంగా చూస్తే.. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు విత్తమంత్రి నిర్మలమ్మ.. ఉత్తచేయి చూపించారని అనుకోవచ్చు. మొత్తంగా ఎడు శ్లాబ్‌లు పెట్టినప్పటికీ.. వాటిలో.. నెలకు.. లక్షన్నర వరకూ జీతం పొందే వారికి… కాస్త మిగులు కల్పించే ప్రయత్నం చేశారు. మిగిలిన వారికి ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close