ఆన్ లైన్ జూదం:  ఇరుక్కున్న త‌మ‌న్నా, రానా

ఆన్ లైన్ లో జూదం విజృంభిస్తోంది. ర‌మ్మీ, డ్రీమ్ 11 ఇలా.. ర‌క‌ర‌కాల పేర్ల‌తో… ద‌ర్జాగా వెలిగిపోతోంది. దీని ప్ర‌చారానికి స్టార్ హీరోలు, క్రికెట‌ర్లు కూడా దిగిపోతున్నారు. ఆన్ లైన్ జూదాన్ని నిషేధించాల‌ని కొంత‌కాలంగా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. తాజాగా.. ఆన్ లైన్ ర‌మ్మీని నిషేధించాలంటూ త‌మిళ‌నాడు హైకోర్టులో ఓ పిటీష‌న్ దాఖ‌లు అయ్యింది. దానిపై న్యాయ స్థానం విచార‌ణ చేప‌ట్టింది. ఆన్ లైన్‌లో జూదం ఆడుతూ, చాలా మంది ల‌క్ష‌లు పోగొట్టుకుంటున్నార‌ని, కొంత‌మంది అప్పులు తీర్చ‌లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని పిటీష‌న్‌లో పేర్కొన్నారు. అంతేకాదు… వీటి ప్ర‌చారంలో స్టార్ హీరోలు, క్రికెట‌ర్లు పాల్గొంటున్నార‌ని, వాళ్ల‌ని చూసి యువ‌త‌రం జూదంపై మోజు పెంచుకుంటోంద‌ని ఆ పిటీష‌న్‌లో ప్ర‌స్తావించారు.

 ఆన్ లైన్ ర‌మ్మీ, డ్రీమ్ 11 ప్ర‌చారం చేస్తున్న సెల‌బ్రెటీలలో త‌మ‌న్నా, రానా, సుదీప్‌, ప్ర‌కాష్ రాజ్‌, కొహ్లి, గంగూలీ లాంటివాళ్లున్నారు. వీళ్లంద‌రికీ ధర్మాస‌నం నోటీసులు పంపింది. యువ‌త‌రాన్ని జూదం ఆడేలా ప్రేరేపిస్తున్నార‌ని, దీనిపై స‌మాధానం ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది. అస‌లు ఆన్ లైన్ జూదాన్ని నిషేధించేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుందా, లేదా? అని త‌మిళ నాడు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిచింది. ఇప్ప‌టికే ఆంధ్ర‌, తెలంగాణ ప్ర‌భుత్వాలు డ్రీమ్ 11ని నిషేధించాయి. మిగిలిన రాష్ట్రాలూ ఈ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. కోర్టు అక్షంత‌లు వేసిన నేప‌థ్యంలో.. ఇక‌పై సెల‌బ్రెటీలూ ఇలాంటి వాటికి ప్రచారం చేయాలంటే ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించుకోవాల్సిందే. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆకలి తీర్చే “అక్షయపాత్ర”

దేన్నైనా తట్టుకోవచ్చు కానీ ఆకలిని తట్టుకోలేరు. అందుకే ఆకలిని తీర్చేవారిని దేవుళ్లంటారు. అలాంటి దేవుళ్లే అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్వాహకులు. అక్షయ పాత్ర ద్వారా రోజూ కొన్ని లక్షల మంది ఆకలి తీరుస్తున్నారు. ...

జయభేరీకి హైడ్రా నోటీసులు

హైడ్రా వాళ్లు.. వీళ్లనే తేడా కనిపించనీయకుండా దూసుకెళ్తోంది. తాజాగా ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోని రంగలాల్...

జగన్‌ టైంపాస్ విమర్శలు !

జగన్మోహన్ రెడ్డికి పాస్ పోర్టు రాలేదు. లండన్ పోలేకపోయారు. అలాగని విజయవాడలో ఉండలేకపోయారు. బెంగళూరు వెళ్లిపోయారు. రాత్రికి రాత్రి ఓ ట్వీట్ పడేశారు. అది చాట భారతం అంత ఉంది...

క్లౌడ్ బరస్ట్ : ప్రపంచానికి కొత్త ముప్పు !

ఇంతటి వర్షాలు ఎప్పుడూ చూడలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఆశ్చర్యపోయారు. గుజరాత్‌ సీఎంగా చాలా కాలం ఉన్నా.. ఎన్నో విపత్తులను చూశా కానీ ఇప్పుడు పడిన వాన, వరద విలయాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close