ఎన్నికలకు ముందు చింతమనేనిని జైల్లో పెట్టే ప్లాన్ ఫెయిల్..!

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మొదటి విడతలో జరగాల్సిన ఎన్నికలు… అధికారులు సహకరించకపోవడం వల్ల నాలుగో విడతకు వాయిదా వేశారు. ఇప్పుడు నాలుగో విడత ఎన్నికలకు వచ్చేశాయి. దెందులూరు నియోజకవర్గంలో పంచాయతీల్లో గెలిచి… తన ఓటమి ప్రజలు ఇచ్చింది కాదని.. ఈవీఎంలదేనని నిరూపించాలన్న పట్టుదలతో చింతమనేని ఉన్నారు. గత కొద్ది రోజులుగా అన్ని పంచాయతీలు చుట్టబెట్టేస్తున్నారు. భారీ హంగామా నేపధ్యంలో ప్రచారం చేస్తున్నారు.

చింతమనేని అలా తిరిగితే.. పంచాయతీల్లో వైసీపీ అనుకూల ఫలితాలు రావడం కష్టమని అనుకున్నారేమో కానీ ఆయనను అర్థరాత్రి అరెస్ట్ చేసేశారు. ఓ గ్రామంలో చింతమనేని ప్రచారం చేసి వెళ్లిన తర్వాత వైసీపీ వర్గీయులు టీడీపీ వాళ్లతో గొడవ పడ్డారు. దాన్నే పోలీసులు కాస్త మార్చుకుని చింతమనేని సర్పంచ్ అభ్యర్థిపై దాడి చేశారని.. సాక్షి మీడియాలో ప్రచారం చేసి పోలీసులు కేసు పెట్టి అర్థరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయనను న్యాయమూర్తి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు. పోలీసులు ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో .. నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తి పోలీసుల్ని ఆదేశించారు. దాంతో వదిలి పెట్టక తప్పలేదు.

అయితే చింతమనేని తనను అక్రమంగా అరెస్ట్ చేశారని… తాను స్టేషన్ నుంచి వెళ్లబోనని భీష్మించారు. పోలీసులు ఆయనను బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించుకుని ఇంటి దగ్గర విడిచిపెట్టి ఊపిరి పీల్చుకున్నారు. చింతమేనని జైల్లో పెట్టి ఎన్నికలు నిర్వహించాలనుకున్న వైసీపీ ప్లాన్ వర్కవుట్ కాలేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే చింతమనేనిపై ఎన్నో కేసులు పెట్టారు. రెండున్నర నెలలు జైల్లో పెట్టారు. ఆ తర్వాత కూడా చింతమనేని ప్రమేయం లేకపోయినా.. ఎవరెవరిద్వారానో ఫిర్యాదు చేయించి కేసులు నమోదు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయినా చింతమనేని వెనక్కితగ్గకుండా పంచాయతీ పోరు సాగిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close