“పెగాసస్” కథంతా అజిల్ ధోబాల్ పేరు మీద నడిచిందా..?

“పెగాసస్” నిఘా వ్యవహారం ఇప్పుడు దేశంలో రాజకీయ సంచలనాలు సృష్టిస్తోంది. అయితే ఇది చాలా కాస్ట్‌లీ వ్యవహారం. ఇజ్రాయిలీ కంపెనీ ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతుంది. ఇన్‌స్టలేషన్ చార్జీలే రూ.ఐదు కోట్ల వరకూ వసూలు చేస్తుంది. నిఘా పెట్టాల్సిన ఫోన్‌ను బట్టి చార్జీలు వసూలు చేస్తుంది. ఐదు ఫోన్లపై నిఘా పెట్టేందుకు రూ. ఐదు కోట్ల వరకూ చార్జ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో పెగాసస్‌ నిఘాను మూడు వందల నెంబర్లకుపైగా ఉపయోగించారని.. అందరి వివరాలు తెలుసుకున్నారని చెబుతున్నారు. అన్ని నెంబర్లు, ఫోన్లపై నిఘా పెట్టాలంటే.. దాదాపుగా రూ. వెయ్యి కోట్లపైనే ఖర్చు అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరి ఈ సొమ్మంతా ఎక్కడ్నుంచి తెచ్చి పెట్టారు… ఏ ఖాతాలో చూపించారనే దానికి విపక్షాలు పరిశోధన చేసి .. కొన్ని వివరాలు ప్రకటిస్తున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు పేరు మీద ఈ పెగాసుస్ వ్యవహారాన్ని నడిపించారని అంటున్నారు. అజిల్ ధోబాల్ కు కేటాయించిన బడ్జెట్.. అనూహ్యంగా పెంచుకుంటూ పోవడమే దీనికి సాక్ష్యంగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి రక్షణ సలహాదారుగా ఉన్న అజిల్ ధోబాల్ బడ్జెట్ 2016-17లో రూ. 33 కోట్లు… కానీ ఆ తర్వాత ఏడాది నుంచి విపరీతంగా పెరిగిపోయింది. 2017-18లో రూ. 333 కోట్లు కేటాయించారు.

ఆ తర్వాత ఏళ్లలోనూ అలాగే కొనసాగించారు. జాతీయ భద్రతా సలహాదారుగా ధోబాల్.. అత్యంత సున్నితమైన అంశాలను డీల్ చేస్తారు. ఉగ్రవాదులపై నిఘా వ్యవహారాలను ఆయనే చూస్తారు. దీంతో పెగాసస్ విషయంలో ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఆయన ద్వారానే ఇప్పుడు నిఘా పెట్టించారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేసిన చరిత్ర ధోబాల్‌కు ఉంది. అప్పుడుకూడా ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో విచారణ జరిగి మొత్తం వివరాలు బయటకు తెలిస్తే కానీ అసలేం జరిగిందో అంచనా వేయడం సాధ్యం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close