నేరుగా కేసీఆర్‌నే టార్గెట్ చేస్తున్న “స్వేరో ప్రవీణ్”..!

ఐపీఎస్ పదవిని వదిలేసిన స్వేరో ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్‌లో చేరుతాడని ప్రచారం జరిగినా అదంతా ఒట్టిదేనని.. ఆయన ప్రకటనలు నిరూపిస్తున్నాయి. తాజాగా ఆయన టీఆర్ఎస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. ఓ వైపు హుజూరాబాద్‌లో దళితుల ఓట్ల కోసం.. కేసీఆర్ ఎక్కడా లేని స్కీములు ప్రవేశ పెడుతూంటే… అదే దళిత వర్గాల్లో కాస్త ఇమేజ్ తెచ్చుకున్న ప్రవీణ్ కుమార్.. వాటిని అంతా ఫార్స్‌గా తోసి పడేస్తూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వంపై విరుచుకుపడటమేతన విధానమని చెప్పకనే చెబుతున్నారు.

గతంలో దైవదూషణ చేసినట్లుగా ప్రవీణ్ కుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి. వీడియోలు కూడా ఉన్నాయి. అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న రెండు రోజుల్లోనే కరీంనగర్లో కేసు నమోదైంది. ఇలాంటి వాటికి తాను భయపడబోనని చెప్పుకొచ్చారు. తనపై కేసు పెట్టడాన్ని ప్రవీణ్ కుమార్ ఓ అవకాశంగా తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్ లు పుట్టుకు వస్తారు. అందరం కలిసి బహుజన సమాజలు సృష్టించుకుందామని పిలుపునిచ్చారు. దళిత ముఖ్యమంత్రి అని గతంలో ఓట్లు దండుకున్నట్లుగా.. మళ్ళీ మోసం చేస్తారని.. అలాంటి చాన్సివ్వకండని ప్రజలకు పిలుపునిచ్చారు. అందరం కలిసి అధికారం దక్కించుకోవాలని..ఇప్పుడు రాకపోతే ఇటువంటి అవకాశము రాదని దళితులకు ఆయన పిలుపునిస్తున్నారు.

అంతే కాదు ప్రభుత్వంలో 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నా…ఆ వర్గాలకు ఎలాంటి ఉపయోగం లేదని తేల్చేశారు. హుజూరాబాద్‌లో కేసీఆర్ దళితులకు పంచాలని అనుకుంటున్న రూ. వెయ్యి కోట్లు గురుకుల పాఠశాలల కోసం ఖర్చు పెడితే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ మారుతుందని చెప్పుకొచ్చారు. దళితుల ఉన్నతి కోసమే తాను పదవులను త్యాగం చేశానని చెబుతున్నారు. అంటే.. ఆయన స్పష్టమైన రాజకీయ లక్ష్యంతోనే ఉన్నారని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close