పెట్రో భారం తగ్గించాలని బీజేపీ రాజకీయ పోరాటాలు !

రాజకీయాలు అంటే ఇంతే. కేంద్రం గత నాలుగైదేళ్లలో ఇబ్బడిమబ్బడిగా ఎక్సైజ్ టాక్స్‌లు, సెస్‌లు విధించి పెట్రో ధరలతో ప్రజల్ని బాదేసింది. కేంద్రం పెంచిన నిష్పత్తిలోనే రాష్ట్రాలూ దోచుకున్నాయి. ఇప్పుడు కొత్తగా కేంద్రం మేము తగ్గిస్తున్నాం.. మీరు తగ్గించండి అంటూ పొలిటికల్ గేమ్ ప్రారంభించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా వరకు పన్నులను తగ్గించాయి. బీజేపీ యేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్రం తగ్గించినట్లుగా రాష్ట్రాలు కూడా తగ్గించాలని బీజేపీ పోరాటాలు ప్రారంభించింది.

తెలంగాణలో ప్రభుత్వం పెట్రోల్ పై 35.20 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 31 శాతం వ్యాట్‌తో పాటు ఒక్క లీటర్‌ మీద అదనంగా నాలుగు రూపాయల వ్యాట్ విధించింది. అలాగే రోడ్ల మరమ్మతుల నిధుల కోసమని లీటర్‌కు మరో రూపాయి సెస్ వసూలు చేస్తోంది. అందుకే తెలంగాణకు.. ఏపీకి మధ్య పెట్రోల్ రేట్లలో రూ. రెండు, మూడు రూపాయల తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కేంద్రం పన్నులను తగ్గించి రాష్ట్రాలను కూడా తగ్గించాలని సూచించింది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇంత వరకూ తగ్గిస్తామని కానీ.. తగ్గించే ఆలోచన చేస్తామని కానీ చెప్పడం లేదు.

ఇది బీజేపీకి గొప్ప అవకాశంగా మారింది. తెలంగాణ బీజేపీ ఈ అంశంలో మరింత దూకుడుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళనలకు పిలుపునిచ్చారు. అయితే ఎన్నికల వ్యూహంతోనే బీజేపీ ఇలా చేస్తోందని.. తమకు ఎన్నికలు లేనందున ఆ అవసరం లేదని చాలా రాష్ట్రాలు భావిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో ఉన్నాయి. రాజకీయం కోసమో.. మరో కారణమో కాని అలవి మాలిన అప్పులు చేసి ఆదాయం పెంచుకునే పరిస్థితి లేక అప్పులపై ఆధారపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రో ధరలపై పన్ను తగ్గిస్తే ఆ భారం ఎక్కువగా ఉంటుంది. అందుకే తగ్గించే ఆలోచన చేయడం కష్టం. అయితే పన్నులు తగ్గించాలన్న రాజకీయ పార్టీల డిమాండ్‌కు ప్రజలు కూడా గొంతు కలిపితే ప్రభుత్వాలకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close