కేటీఆర్ పట్టుదలకు ప్రతిఫలం..మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ !

హైదరాబాద్‌ను డేటా సెంటర్‌గా మార్చేందుకు కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. గచ్చిబౌలిలోని మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో మైక్రోసాప్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ప్రకటించారు. రూ. పదిహేను వేల కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ పెట్టనుంది.

మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలను కూడా పరిశీలించింది. కానీ కేటీఆర్ పట్టుబట్టి హైదరాబాద్‌లో డేటా కేంద్రం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేశారు. మైక్రోసాఫ్ట్ యాజమాన్యాన్ని అంగీకరింప చేశారు. మైక్రోసాఫ్ట్‌లో నిర్ణయాలు అంతతేలికగా జరగవు. పక్కాగా పూర్తయిన తర్వాతే అంగీకరిస్తారు. భూమి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ సర్కార్ భూమిని మైక్రోసాఫ్ట్ కంపెనీకి చూపించింది. ఆ భూమి.. ప్రభుత్వం కల్పిస్తామని హామీ ఇచ్చిన సౌకర్యాల పట్ల మైక్రోసాఫ్ట్ సంతృప్తి చెందింది. ఆ తర్వాతే ఒప్పందం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలు పోటీ పడినా కేటీఆర్ చొరవతో హైదరాబాద్‌కే దక్కింది.

హైటెక్ సిటీలో మైక్రోసాఫ్ట్ డెలవప్‌మెంట్ సెంటర్ పెట్టిన తర్వాత… ఎలా అయితే.. సాఫ్ట్‌వేర్ సిటీగా మారిందో.. ఇప్పుడు.. ఏదే తరహాలో.. మైక్రోసాఫ్ట్.. డేటా సెంటర్ గా హైదరాబాద్ మరే అవకాశం ఉంది. తెలంగాణలో డేటా సెంటర్ పెట్టాలని ఇప్పటికే అదానీ గ్రూప్ నిర్ణయించింది. హైదరాబాద్‌లో 13 బిలియన్ డాలర్ల వ్యయంతో డేటా సెంటర్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది.డేటా రంగంలో ఉన్న మరికొన్ని ప్రధానమైన కంపెనీలచూపు కూడా హైదరాబాద్ వైపు ఉన్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close