జగన్ అలా ఢిల్లీ వెళ్లి ఇలా తిరిగి వచ్చారు !

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఓ పూటలో ముగిసిపోయింది. పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ప్రో వైసీపీ మీడియా కూడా జగన్ పర్యటనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉదయమే ప్రధాని ఇంట్లో అరగంట సేపు ఉన్నారు. వారి మధ్య భేటీ ఎంత సేపు జరిగిందో స్పష్టత లేదు. అయితే ఎప్పట్లాగే… పోలవరం దగ్గర్నుంచి అన్నిరకాల డిమాండ్లతో ఓ నివేదికను మాత్రం ఇచ్చారు. దాన్నే మీడియాకు చెప్పారు. అ తర్వాత విద్యుత్ మంత్రిని కలిశారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిశారు.

అయితే సామాజిక న్యాయం అని పెద్ద పెద్ద మాటలు చెప్పే జగన్ రెడ్డి.. తనతో పాటు విజయసాయిరెడ్డిని.. మిథున్ రెడ్డిని తీసుకెళ్లారు. మరొకరికి చాన్సివ్వలేదు. ఈ విషయం కూడా చర్చనీయాంశమయింది. ఆ తర్వాత తిరుగుపయనయ్యారు. ఎప్పుడూ అడిగే వాటి కోసం జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో స్పష్టత లేదు. అమిత్ షాను కూడా కలుస్తారని ప్రచారం జరిగినా అపాయింట్‌మెంట్ మాత్రం లభించలేదని తెలుస్తోంది.

అయితే జగన్ రాష్ట్ర విషయాల కోసం కాకుండా మారుతున్న రాజకీయ పరిస్థితులను చక్క బర్చుకోవడం కోసం వెళ్లినట్లుగా తెలుస్తోంది. మోదీతో ఆయన రాజకీయ అంశాలపై చర్చించిఉంటారని అంటున్నారు. అవేమిటో తెలిసే చాన్స్ లేదు. జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి అర్థం చేసుకోవాల్సిందే. మొత్తంగా జగన్ ఢిల్లీ పర్యటన ఎప్పటిలా ఎవరికీ ఆసక్తి కలిగించలేదు. చివరికి వైసీపీ నేతలు కూడా. ఎందుకంటే.. జగన్ వెళ్తారు.. వస్తారు.. చివరికి లోపల ఏం జరిగిందో కూడా తెలియదు. కానీ ఒకటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అందుకే ఎవరూ పట్టించుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close