బాకా ఊదుతున్న రిటైర్డ్ జర్నలిస్టులకు రూ.10 లక్షల నజరానా !

సీఎం జగన్ జిల్లాల పర్యటనలకు పరదాలు కడుతున్న వారు బిల్లులివ్వడం లేదు మహా ప్రభో అని గగ్గోలు పెడుతున్నారు. హైకోర్టులో ప్రభుత్వం నుంచి చేసిన పనులకు బిల్లులు రావడం లేదని.. రోజుకు ఆరేడు వందల పిటిషన్లు పడుతున్నాయి. అవన్నీ పక్కన పెట్టి.. ఒక్కొక్కరికి రూ. పది లక్షలు ఇస్తామంటూ వైఎస్ఆర్ అవార్డుల్ని ప్రకటించారు. మిగిలిన వాళ్లను పక్కన పెడితే..నలుగురు జర్నలిస్టుల పేర్లు మాత్రం అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ నలుగురు ఎవరంటే బండారు శ్రీనివాసరావు, సతీష్ చందర్, మంగు రాజగోపాల్, ఎంఈవీ ప్రసాదరెడ్డి.

వీరి గురించి జర్నలిజం సర్కిళ్లలో అందరికీ తెలుసు. ప్రభుత్వానికి బాకా ఊదడానికి ఏ మాత్రం సిగ్గుపడకుండా.. అడ్డగోలుగా సమర్థిస్తూ మాట్లాడటంలో రాటుదేలిపోయారు. బండారు శ్రీనివాసరావు అనే జర్నలిస్టు రిటైరైన తర్వాత ఎర్నలిస్టుగా మారారు. అడ్డగోలుగా వాదిస్తూ టీవీ చానళ్లలో చర్చల్లో పాల్గొంటున్నారు. ఆయనకు ఎంతో కొంత ముట్టచెప్పాలనుకున్నారు కాబట్టి వైఎస్ఆర్‌ అవార్డు కింద నగదు ప్రకటించినట్లుగా ఉంది. మిగిలిన వారూ అంతే. ఇక ఎంఈవీ ప్రసాదరెడ్డి అనే జర్నలిస్టు గురించి .. పెద్దగా ఎవరికీ తెలియదు. కళ్లను నమ్ము కమ్మని నమ్మవద్దంటూ.. ఇటీవస ఈ రెడ్డిగారు ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్యూ ఇచ్చారు.

ఇది బాగా నచ్చిందేమో కానీ ఓ రూ. పది లక్షల అవార్డు ఇచ్చేశారు. వీరి ఎంపిక ఇతర సీనియర్ జర్నలిస్టులకుపోటీ పెట్టినట్లయింది. ఎవరు గొప్పగా పొగుడుతారో.. వాళ్లకి వచ్చే సారి అవార్డిస్తారు. రూ. పది లక్షలు గెల్చుకోవచ్చు. అయితే ఈ అవార్డులు ఎప్పుడిస్తారు.. జయంతి.. వర్థంతులు.. సెప్టెంబర్‌తోనే అయిపోయాయి. మళ్లీ వచ్చే ఏడాది వరకూ ఆగాలా.. మరో కార్యక్రమం పెట్టి ఇస్తారా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రగిలిపోతున్న నార్త్ హిందూ సమాజం !

ఏం చేసినా జగన్ రెడ్డిని సమర్థించే అంధ వ్యక్తులు ఏపీలో ఉంటారేమో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండరు. ఆయన చేసిన మత మార్పిళ్లు.. ఆయన చేసిన హిందూ వ్యతిరేక కుట్రలు దేశం మొత్తం...

ఒకే ఒక్క ప్రశ్న : క్వాలిటీ నెయ్యి అంత చీప్ ఎలా ?

రన్ అనే ఓ సినిమాలో రోడ్ సైడ్‌లో ఐదు రూపాయలకే బిర్యానీ బోర్డు కనిపిస్తే సునీల్ వెంటనే ఓ ప్లేట్ లాగించేస్తాడు. తర్వాత అతని గొంతు నుంచి కాకి అరుపులు వస్తూంటాయి....

న్యాయవ్యవస్థతో ఇప్పటికీ జగన్ రెడ్డి ఆటలు !

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని.. జరుగుతున్న ప్రచారాన్ని ఆపాలని జగన్ రెడ్డి పరుగు పరుగున హైకోర్టుకు వెళ్లారు. తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తానని...

‘పుష్ష 2’ సెట్లో గొడ‌వ జ‌రిగిందా?

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. జానీ మాస్ట‌ర్‌కూ బాధితురాలికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని ఓ పెద్ద హీరో ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుకుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close