పులివెందులలో కాల్పులు – వివేకా కేసు లింక్ !?

పులివెందులలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మార్కెట్ సెంటర్లో ఒక్క సారిగా కాల్పుల శబ్దం వినిపించడంతో జనం ఉలిక్కి పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పులు జరిపిన వ్యక్తిని భరత్ కుమార్ యాదవ్ గా గుర్తించారు. దిలీప్ అనే వ్యక్తితో ఉన్న ఆర్థిక వ్యవహారాల్లో తేడాలు రావడంతో భరత్ కుమార్ యాదవ్ కాల్పులు జరిపినట్లుగా చెహుతున్నారు.

భరత్ కుమార్ యాదవ్ పేరు వైఎస్ వివేకా హత్య కేసులో కూడా వినిపించింది. సీబీఐ ఆయనను ప్రశ్నించింది. వివేకానందరెడ్డి హత్య ఘటనకు వివాహేతర సంబంధాలు, సెటిల్మెంట్లే కారణమని తరచూ మీడియా మందుకు వచ్చి చెబుతూ ఉంటారు. ఈయనకు ప్రో వైసీపీ మీడియా మంచి కవరేజీ ఇస్తూ ఆరోపణలు ప్రచురిస్తూ ఉంటుంది. సీబీఐ పై కూడా భరత్ కుమార్ యాదవ్ ఆరోపణలు చేశారు. సునీత భర్త రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రాణహానీ ఉందని మీడియా సమావేశాల్లో చెబుతూ ఉంటారు.

గత ఏడాది ఫిబ్రవరిలో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనను భరత్ యాదవ్ భయపెడుతున్నారని, ప్రలోభ పెడుతున్నారని సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు. భరత్ యాదవ్ తన ఇంటికి వస్తన్నారని అవినాష్ రెడ్డిని కలవాలంటున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే భరత్ యాదవ్ అప్పట్లో రివర్స్ ఆరోపణలు చేశారు. దస్తగిరి ని సీబీఐ వాళ్ళు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తనకు రావాల్సిన డబ్బులు దస్తగిరి ని అడిగానని … కావాలనే దస్తగిరి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.

ఓ ఊరూపేరూ లేని పత్రికకు జర్నలిస్టుగా చెప్పుకునే భరత్ యాదవ్.. వైసీపీ తరచూ చెప్పే… వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డినే హత్యకు కుట్రధారులనే స్టోరీని తరచూ వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు జరిపిన కాల్పుల్లో కూడా.. వివేకా హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాల్లో అర్థిక అంశాలపై తేడా రావడం వల్ల జరిగాయా.. లేక మరొకటా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఏపీ పోలీసులు ఈ కేసును వీలైనంత సాధారణంగా చేస్తారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close