సీఎం జగన్ దెబ్బకు గింగరాలు తిరుగుతున్న ఇండిగో !

సీఎం జగన్ దెబ్బకు ఇండిగో విమానయాన సంస్థ గింగరాలు తిరుగుతోంది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం కాబట్టి భయమేం లేదని.. డబ్బులొచ్చేస్తాయని రంగంలోకి దిగింది. తీరా దిగిన తర్వాత తెలిసింది … ప్రభుత్వం కాదు.. ముఖ్యం జగన్ రెడ్డి అని. అసలు విషయం ఏమిటంటే.. కడప ఎయిర్ పోర్టులు గతంలో సర్వీసులు ఆగిపోయాయి. ఎవరూ ప్రయాణించడం లేదని కంపెనీలు సర్వీసులు ఆపేశాయి. దీంతో జగన్ రెడ్డికి తలకొట్టేసినట్లయింది. తన ఏలుబడిలో సొంత ప్రాంతానికి విమానాలు లేకపోవడం ఏమిటని ఫీలైపోయి..ఇండిగోతో వయబులిటి గ్యాప్ పండింగ్ ఒప్పందం చేసుకుని సర్వీసులు ప్రారంభించారు. ఈ ఒప్పందం ప్రకారం ఏడాదికి రూ. ఇరవై కోట్లు ఇండిగోకు చెల్లించాలి.

కానీ ఇండిగో బతిమాలుతోంది కానీ.. పట్టించుకోవడం లేదు. దీంతో చివరికి సర్వీసులు నిలిపివేయాలని నిర్ణయించి బుకింగ్స్ ఆపేసింది. కానీ కడప కలెక్టర్ బతిమాలడంతో పదిహేను రోజుల అదనపు సమయం ఇచ్చింది. ఏపీలో జగన్ రెడ్డి పాలన మొదలయ్యాక.. ఎయిర్ పోర్టులన్నీ బోసి పోతున్నాయి. ఒకప్పుడు విజయవాడ ఎయిర్ పోర్టు నుండి సింగపూర్ కు నేరుగా విమానం ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా విజయవాడను అభివృద్ధి చేసి.. విమానాలను నేరుగా పంపించడానికి.. వయబులిటి గ్యాప్ ఫండింగ్ చేసేందుకు అంగీకారం తెలిపి ఈ సర్వీసును ప్రారంభించారు. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అంటే… ఓ లెక్క ప్రకారం సీట్లు నిండకపోతే..ఆ సీట్ల డబ్బులు ప్రభుత్వం చెల్లించడం.

అయితే విజయవాడ టు సింగపూర్ సర్వీసుకు ఆదరణ ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వంvరూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. కానీ లోకల్ లో తిప్పాలనుకున్న విమానాలకూ ప్రయాణకులు లేకపోవడంతో ఇండిగోకు డబ్బులు కట్టాల్సి వస్తోంది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి రూ. ఇరవై కోట్లు సర్దటం కష్టంగా మారింది. బతిమాలినా ఇవ్వడం లేదు. అయితే జగన్ రెడ్డి నిర్వాకం వల్ల ఆంద్రప్రదేశ్ బ్రాండే సర్వనాశనం అవుతోందని…పాశ్రామిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close