చంద్రబాబు వచ్చే యాభై ఏళ్ల వరకూ ఏం చేయాలో చెబుతూంటాడని అప్పటి వరకూ ఎవరు బతికి ఉంటారని సీఎం జగన్ మాచర్లలో ప్రశ్నించారు. ఆయన మాటలు విన్న ఎవరికైనా….. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్న మైండ్ సెట్ తో ఉండే వ్యక్తి కనిపించి ఉంటే తప్పేమీ లేదు. లీడర్ అంటే తన కోసం పని చేసేవాడు కాదు… జనం కోసం.. భవిష్యత్ తరాల కోసం పని చేసేవాడని జగన్ రెడ్డికి ఇప్పటికీ తెలియదేమో కానీ.. ఆయన మాటలు విన్న వారికి మాత్రం… ఏపీ దుస్థితి ఎందుకు ఈ స్థితిలో ఉందో క్లారిటీ వచ్చేస్తుంది.
ముఖ్యమంత్రి భవిష్యత్ తరాల కోసం పని చేయాల్సిన తెలివి తేటలతో పరిపాలించాల్సిన నేత. జగన్ రెడ్డికి సొంత ఆలోచన ఉండదు. రాసిచ్చిందే చదువుతారు. బహుశా ఆ మేధావి కూడా ఇదే రాసి ఇచ్చి ఉంటారు. ప్రదాని మోదీ కూడా 2047 అని ప్రణాళికలు వేస్తున్నారు. అందరి దగ్గరా విజన్ డాక్యుమెంట్ అడుగుతున్నారు. దాన్ని బట్టి దేశం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మరి జగన్ రెడ్డి కూడా ప్రధాని మోడీని ఇలాగే అంటున్నట్లేగా? .
జగన్ రెడ్డి సొంత వ్యాపారాలు, ఆస్తుల విషయంలో చాలా వరకూ విజన్ ఉంటుంది. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆస్తుల్ని సొంత ఆస్తులుగా అమ్మేసకుని క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారు. ఇప్పటికీ అదే చేస్తున్నారు. ఆయన వ్యాపారాలు మాత్రం అద్భుతంగా సాగుతున్నాయి. ఈ విషయంలో ఆయన విజన్ వచ్చే ముఫ్పై , నలభై కాదు..99 ఏళ్ల వరకూ ఉంటుంది. ఇటీవల తన బినామీ కంపెనీకి విశాఖలో బేపార్క్ ను 99 ఏళ్లకు లీజుకిచ్చేశారు. కానీ రాష్ట్రం దగ్గరకు వచ్చే సరికి మాత్రం అప్పటి వరకు ఎవరుంటారు.. ఎవరు బతికి ఉంటారని కబుర్లు చెబుతున్నారు.
చంద్రబాబు చెప్పే ప్రతి మాటను.. తప్పు అని చెప్పడానికి ఎలాంటి వింత వాదన అయినా ఎత్తుకుంటారు.. తాను చేసే ప్రతి తప్పుడు పని, అవినీతి ప్రజల కోసమే అని చెప్పేందుకు ఎలాంటి మాటల్ని అయినా ప్రయోగించేందుకు వెనుకాడరు. దానికి ఇప్పుడు ఎన్నికలకు నాలుగు నెలల ముందు చేస్తున్న శంకుస్థాపనలు.. ఇదే శంకుస్థాపనలపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.