ప్లాన్ రివర్స్ – పోలింగ్ బూత్ ఇంచార్జులుగా టీచర్లే

ఆంధ్రప్రదేశ్ లో టీచర్లను పోలింగ్ విధులకు దూరంగా ఉంచేందుకు జగన్ రెడ్డి చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలకు గండిపడింది. టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాల్సిందేనని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. దీంతో టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రారంభించారు. సీఈవో ఆదేశాలతో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ వివరాలు సేకరిస్తున్న డీఈవోలు ఆ వివరాలను శుక్రవారం ఉదయం 11 గంటల లోగా సీఈవోకు పంపనున్నారు. ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని బుధవారం నిర్వహించిన సీఈసీ భేటీలో ప్రస్తావించారు.

దీంతో అసలు సిబ్బందిపై చర్చ జరిగింది. సచివాలయ ఉద్యోగుల్ని తీసుకోవద్దని విపక్షాలు డిమాండ్ చేస్తున్న అంశంపైనా చర్చించారు. వారిని తీసుకున్నా సిబ్బంది సరిపోరని తేలడంతో టీచర్లను నియమించాలని ఆదేశించారు. ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లుగా టీచర్లను నియమించనున్నారు. అంటే.. పోలింగ్ బూత్ ఇంచార్జిగా ప్రిసైడింగ్ ఆఫీసరే ఉంటారు. టీచర్లే ఇంచార్జులుగా ఉంటారు కాబట్టి జగన్ రెడ్డి ప్లాన్ పూర్తి రివర్స్ అయినట్లవుతుంది.

ఒక్క టీచర్లు కాదు ఏపీలో ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే ఏ ఒక్క ఉద్యోగి సంతృప్తికరంగా లేరు. అయినా టీచర్లు ఇంకా ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారు. అందుకే వారిని పోలింగ్ విధులకు దూరంగా ఉంచాలని.. చట్టం కూడా తీసుకు వచ్చారు. ఆ చట్టం ఎన్నికల సంఘానికి వర్తించదు. ఇది తెలిసి కూడా చేశారు. చివరికి టీచర్ల చేతుల్లోకే ఎన్నికల విధులు వెళ్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close