జగన్ కేసులపై రఘురామ పిటిషన్లను కొట్టేసేది లేదన్న సుప్రీంకోర్టు

జగన్ ఆస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ బెయిల్ రద్దు, జగన్ కేసుల విచారణ తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేశారు. విచారణలో ప్రజాప్రతినిధులపై దాఖలైన పిటిషన్లను త్వరితగతిన విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జగన్ లాయర్ నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. అందుకని పిటిషన్ పై విచారణ ముగించాలని జగన్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.

అయితే తాము ఈ పిటిషన్ లపై విచారణ ముగించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు సుమోటోగా ఆదేశాలు ఇచ్చినందున మూడు నెలల గడువు ఇవ్వాలని, ఆ తరువాత పరిశీలన జరపాలని జగన్ తరపు న్యాయవాదులు కోరారు. సమయం ఇచ్చి ఉపయోగం ఏంటి? ఫలితం ఎక్కడా కనిపిచడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జగన్ ఆస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. తాము బాధ్యులం కాదని సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలపగా.. ఎవరు బాధ్యత వహిస్తారని తుషార్ మెహతాను సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ప్రశ్నించింది. ఇన్నిసార్లు వాయిదాలు పడటం, ఇంతకాలయాపన జరగడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది.

రాజకీయ దృక్పదంతో పిటిషన్ ను పిటిషనర్ ఇక్కడ దాఖలు చేశారని జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నుంచి తనపై చర్యలు తీసుకున్నారని, గత మూడేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని పిటిషనర్ పై నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. రఘురామ రాజుపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినందునే ఇక్కడ ఈ పిటిషన్లు దాఖలు చేశారని అన్నారు. అయితే, జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ.. తాము రాజకీయ వ్యవహారాలను పరిశీలించడం లేదు.. కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close