మళ్లీ రోడ్డెక్కనున్న పవన్ వారాహి రథం

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దిగనున్నారు. వారాహి రథయాత్రను మరో పది రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్ల కోసం ప్రాంతాల వారీగా కమిటీ్ని నియమించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా విభజించి కమిటీలు ఏర్పాటు చేశారు . ప్రతీ జోన్ లోనూ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు, లీగల్ టీం, డాక్టర్స్ టీం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని పూర్తి సమన్వయంతో నిర్వహించేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ ప్రచారానికి ప్రభుత్వం ఆటంకాలు కల్పించే అవకాశం ఉంది. అందుకే ప్రతీ ఏరియాకు ముందస్తుగానే అనుమతులు ఇతర న్యాయపరమైన ప్రక్రియ కోసం ప్రత్యేకంగా లాయర్ల టీంను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే ఎలాంటి ప్రమాదాలు జరిగినా తక్షణ వైద్య సాయం కోసం వైద్య బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేసినా రెండు పార్టీల అభ్యర్థుల కోసం పవన్ రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తారు.

పవన్ కల్యాణ్ ఇంతకు ముందే వారాహి యాత్రను ప్రారంభించారు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు విశాఖ, కృష్ణా జిల్లాలో పూర్తి చేశారు. తర్వాత రాజకీయ పరిణామాలతో గ్యాప్ ఇచ్చారు. ఎన్నికల సన్నాహాలు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆ సన్నాహాలు తుది దశకు రావడంతో ఎన్నికల ప్రచార బరిలోకి దిగాలనుకుంటున్నారు. టీడీపీతో పొత్తు కూడా ఖరారైంది. ఎన్ని సీట్లు ఇస్తారన్నదానిపై అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థులపైనా పవన్ ఒక్క సారే అంచనాకు వస్తున్నారని చెబుతున్నారు. టీడీపీతో కలిసి కొన్ని ఉమ్మడి బహిరంగసభలను కూడా నిర్వహించబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close