గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేందుకు కేటీఆర్‌కు ఆసక్తి లేదా !?

లోక్‌సభ నియోజకవర్గాలవారీగా కేటీఆర్ సమీక్షలు నిర్వహించారు. అయితే ఇందులోనూ ఆయన ప్రసంగాలు.. తాము ఎందుకు ఓడిపోయామో.. తనదైన శైలిలో విశ్లేషించారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఓట్లేశారన.ి. బంధు పథకాలు వ్యతిరేకమయ్యాయని.. కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చిందని ఇలా తమకు అనుకూలంగా ఉన్న వాటిని చెప్పుకొచ్చారు. కానీ అసలు కింది స్థాయిలో ఏం జరిగిందో క్యాడర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు మాత్రం సిద్ధపడలేదు.

16 రోజులపాటు 17 ఎంపీ స్థానాలపై నిర్వహించిన సమీక్షా సమావేశాలు నిర్వహించారు. నిర్దిష్టంగా ఫలానా కార్యాచరణ అంటూ ఖరారు చేసుకోలేకపోయారు. అప్పుడే కాంగ్రెస్ పై ప్రజాగ్రహం పెరిగిపోతుందన్న ఆశతో … ప్రజలే తిరిగి బీఆర్ఎస్ కు ఓట్లేస్తారన్నట్లుగా కేటీఆర్ శైలి ఉంది. పార్టీ నిర్మాణం, దాని బలోపేతంపై లోతైన చర్చ చేయలేకపోయారు. క్యాడర్‌ను అస్సలు పట్టించుకోలేదనీ, కార్యకర్తలకు సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాలను నేరుగా లబ్దిదారులకు అందజేయటం కూడా పార్టీకి తీరని నష్టం చేకూర్చిందనే విషయాన్ని గుర్తించడానికి కేటీఆర్ మొహమాట పడ్డారు.

పదేండ్ల కాలంలో పార్టీ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావును తాము కలిసిందే లేదని పలు నియోజకవర్గాలకు చెందిన సీనియర్‌ నేతలు సైతం సమీక్షల సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. వారిని కలిసేందుకు వస్తే అపాయింట్‌మెంట్లు దొరికేవి కావనీ, ఒకవేళ దొరికినా ఎమ్మెల్యేలు తమను కలవనీయకుండా అడ్డుకున్నారంటూ వారు వాపోయారు. కేటీఆర్ క్యాడర్ ఆవేదనను గుర్తిస్తే తప్పులు దిద్దుకోవచ్చని లేకపోతే… చేయగలిగిందేమీ లేదన్న అభిప్రాయం ఎక్కువగా బీఆర్ఎస్ లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close