రోజాకు ఒంగోలు ఎంపీ టిక్కెట్ !

రోజాను ఎలా బలిపశువును చేయాలా అని తీవ్రంగా పరిశోధించి చివరికి ఒంగోలు ఎంపీగా నిలబెట్టాలన్న ఆలోచనకు జగన్ రెడ్డి వచ్చారని వైసీపీలో స్పష్టమయింది. మాగుంట శ్రీనివాసులరెడ్డి విషయంలో ఈగోకు పోతున్న జగన్ రెడ్డి ఆయనకు టిక్కెట్ ఇచ్చేది లేదని చెబుతున్నారు. కానీ అక్కడ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. డబ్బులు పెట్టుకునేందుకు రెడీ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చాన్సివ్వాలని అనుకున్నా.. బాలినేని సహా అక్కడి నేతలంతా మూకుమ్మడి రాజీనామా చేస్తారేమోనని భయపడి ఆగిపోయారు. కొంత మంది రియల్టర్లను.. ఇతరుల్ని పరిశీలించి .. చివరికి రోజా అయితే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు.

నగరి నుంచి మరోసారి పోటీ చేయాలని రోజా అనుకుంటున్నారు. కానీ ఆమెకు టిక్కెట్ ఇచ్చే ఉద్దేశంలో జగన్ లేరు. అందుకే ఆమెకు వ్యతిరేకంగా అసమ్మతి చాలా ఉందని మెల్లగా పార్టీ నేతల్ని బయటకు వచ్చేలా ప్రోత్సహించారు. డబ్బులు ఇచ్చినట్లుగా సొంత పార్టీ కౌన్సెలర్ ఆరోపణలు చేశారు. జడ్పీటీసీలు.. ఇతర నేతలు రోజాకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని చెబుతున్నారు. ఇదంతా స్క్రిప్ట్ ప్రకారమే తెర ముందుకు వస్తోందని వైసీపీ నేతలకు తెలుసు.

ఇప్పుడు రోజాకు.. ధిక్కరించే అవకాశం లేదు. టిక్కెట్ నిరాకరించినా ఆమెకు మరో చోట ఆప్షన్ లేదు. కానీ నిరాకరిస్తే ఆమె చేసే రచ్చను తట్టుకోవడం జగన్ రెడ్డి, సజ్జల వల్ల కాదు. అందుకే ఏదో ఓ టిక్కెట్ అని ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. రోజా ఒప్పుకోకపోవడానికి చాన్స్ లేదు కాబట్టి.. ఫిక్సయిపోయినట్లే. అయితే చివరి క్షణంలో సౌండ్ పార్టీ వస్తే.. రోజాకు ఆ టిక్కెట్ కూడా గల్లంతయిపోతుందన్న భయం ఉండనే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close