వైసీపీ బీసీ చీఫ్ జంగా కృష్ణమూర్తి యాదవ్ ప్రశ్నలకు జగన్ దగ్గర ఆన్సర్ ఉందా ?

వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి యాదవ్ .. జగన్ రెడ్డి బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని తెరపైకి తీసుకు వస్తూ సంచలన విషయాలను వెల్లడించారు. దాదాపుగా ఏడు నిమిషాల పాటు ఉన్న వీడియోను ఆయన విడుదల చేశారు. వైసీపీలో బీసీల పేరుతో ఎలా రాజకీయాలు చేస్తారో.. వారికి పదవుల పేరుతో ఎలా బలి పశువుల్ని చేస్తారో క్లుప్తంగా వివరించారు. నిజానికి అవన్నీ బయటకు అందరికీ తెలిసినవే. కానీ పదవి ఉంటే చాలు అధికారం లేకపోయినా పర్వాలేదనుకునే నేతల వల్ల వైసీపీ లో రెడ్ల ఆధిపత్యం అలా గడిచిపోతోంది.

జంగా కృష్ణమూర్తి యాదవ్ గత ఎన్నికలకు ముందు తెలంగాణ నుంచి యాదవ నేతల్ని తీసుకు వచ్చి తన నియోజకవర్గంలో భారీ బీసీ సభ నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వంపై అప్పట్లో కుల విద్వేషం రెచ్చగొట్టడానికి చేసిన అనేక వ్యూహాల్లో ఆయన కూడా భాగమయ్యారు. తలసాని లాంటి వాళ్లను తీసుకొచ్చి తన వంతు సాయం చేశారు. అయితే జగన్ రెడ్డి మోసం చేశారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. కాసు మహేష్ రెడ్డికి ఇచ్చారు. ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తామని ఆశ పెట్టారు. చివరికి అదీ ఇవ్వలేదు సరి కదా.. గురజాలలో ఆయన ప్రభావం లేకుండా చేసేందుకు ఎంత చేయాలో అంత చేశారు.

దీంతో ఆయన ఇటీవల వైసీపీ అధినేతపై అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక ఆ పార్టీలో ఉంటే తనకు భవిష్యత్ లేదని ఆయనకు అర్థమైపోయింది. తన నియోజకవర్గంలో తనను అనామకుడ్ని చేస్తున్నారని క్లారిటీ రావడంతో ఆయన తిరుగుబాటు ప్రారంభించారు. మొదటి నుంచి జగన్ రెడ్డితో కలిసి నడిచిన ఆయన ఇప్పుడు తిరుగుబాటు చేశారు. ఆయన వేసిన ప్రశ్నలకు వైసీపీ నేతల దగ్గర ఆన్సర్ ఉండదు. వారికి తెలిసిన కౌంటర్ ఏమిటంటే.. బూతులతో విరుచుకుపడటమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close