‘స్పిరిట్’ రేసులో ముగ్గురు హీరోయిన్లు

‘యానిమ‌ల్‌’తో సూప‌ర్ డూప‌ర్ హిట్టు కొట్టాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో సందీప్ పేరు మ‌రోసారి బాలీవుడ్ లో మార్మోగిపోయింది. ఈ హిట్ తో.. ‘స్పిరిట్‌’పై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోయాయి. ప్ర‌భాస్‌ని సందీప్ ఎలా చూపిస్తాడో.. అంటూ ఫ్యాన్స్ ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ని సందీప్ రెడ్డి వంగా ఇప్ప‌టికే మొద‌లెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈయేడాది డిసెంబ‌రులో షూటింగ్ ప్రారంభించ‌డానికి సన్నాహాలు చేస్తున్నాడ‌ని ప్లాన్‌. ప్ర‌భాస్ కూడా.. ‘డిసెంబ‌రు నుంచి నేను రెడీ’ అంటూ సందీప్‌కి సంకేతాలు పంపాడ‌ని తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ కోసం సందీప్ రెడ్డి ఇప్ప‌టికే ఓ అంచ‌నాకు వచ్చిన‌ట్టు తెలుస్తోంది. హీరోయిన్‌గా ర‌ష్మిక, కీర్తి సురేష్‌, మృణాల్ ఠాకూర్ పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. వీళ్ల‌లో ఒక‌రు ప్ర‌భాస్ ప‌క్క‌న న‌టించ‌డం ఖాయం. ప్ర‌భాస్ – హ‌ను రాఘ‌వ‌పూడి కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో మృణాల్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని టాక్‌. ఆ సినిమాలో గ‌నుక మృణాల్ హీరోయిన్‌గా ఫిక్స‌యితే.. ‘స్పిరిట్లో’ ర‌ష్మిక గానీ, కీర్తి గానీ న‌టిస్తారు. ప్ర‌భాస్ ప‌క్క‌న ఇప్ప‌టి వ‌ర‌కూ న‌టించ‌ని క‌థాlఆయిక‌ని హీరోయిన్‌గా తీసుకురావాల‌న్న‌ది సందీప్ ప్లాన్. ‘యానిమ‌ల్‌’లో ర‌ష్మిక వ‌ర్క్ తో ఇంప్రెస్ అయిన సందీప్‌… మ‌రోసారి ఆమెనే ఎంచుకొనే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close