కూటమిలో సీట్లు, అభ్యర్థుల మార్పులు !

అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఏర్పడిన పరిస్థితులను బట్టి కొన్ని చోట్ల సీట్లు, అభ్యర్థులను మార్పు చేసేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రఘురామకు సీటు కేటాయించడం ఖాయమయింది. అందు కోసం ఏదో ఓ చోట మార్చాల్సి వస్తోంది. ఏలూరు సీటు బీజేపీకి ఇచ్చి.. నర్సాపురంను టీడీపీకి ఇచ్చే విషయంపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇక రాష్ట్ర స్థాయిలోనూ కొన్ని స్థానాలపై కసరత్తు ప్రారంభమయింది.

ఆనపర్తి నియోజకవర్గంలో బీజేపీ అత్యంత బలహీనమైన అభ్యర్థి. ఆయన ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సీటులో టీడీపీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పట్టుదలకు పోయి ఓడిపోవడం కన్నా.. టీడీపీ నుంచి రామకృష్ణారెడ్డి పోటీ చేయడమే మంచిదన్న వాదన వినిపిస్తోంది. ఆయన బీజేపీ నుంచి పోటీ చేయమన్న ప్రతిపాదన వచ్చినా.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకరించలేదని చెబుతున్నారు.

అనకాపల్లి జిల్లా ఎంపీ స్థానం పరిధిలో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు కోసం సీఎం రమేష్ పట్టుబడుతున్నారు. యలమంచిలి, మాడుగుల స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చాలని కోరుతున్నారు. మాడుగులలో టీడీపీ అభ్యర్థి పైలా ప్రసాద్ గట్టిగా ప్రయత్నించలేకపోతున్నారని ఆయన స్థానంలో బండారు సత్యనారాయణమూర్తికి ఇవ్వాలన్న ప్రతిపాదన సీఎం రమేష్ పెట్టారు. అదే సమయంలో యలమంచిలిలో జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్ స్పీడ్ అందుకోలేకపోతున్నారని.. ఆయనకు బదులుగా బీజేపీ అభ్యర్థిని నిలబెట్టాలన్న ప్రతిపాదన కూడా రమేష్ పెట్టారు. వీటిపై ఒకటి, రెండు రోజుల్లోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close