చిరంజీవిపై విషం – వైసీపీ మరో తప్పిదం !

చిరంజీవి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించగానే వైసీపీ విషం చిమ్మడం ప్రారంభించింది. సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా విచిత్రంగా స్పందించారు. ఆయన తీరు చూసి సోషల్ మీడియాలో కూడా చిరంజీవిపై ఘోరమైన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు వైసీపీ నేతలు. అసలు చిరంజీవి తన సోదరుడికి కాకుండా మరెవరికి మద్దతిస్తారని వైసీపీ నేతలు అనుకుంటారో వైసీపీ నేతలకూ అర్థం కాదు.

చిరంజీవిని అధికారం చూపించి బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మధ్యస్థంగా ఉండిపోయారు. ఎన్నికల సమయంలోనూ అలాగే ఉండిపోవాలని అనుకున్నారు. కానీ చిరంజీవి తమ్ముడికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని మరోసారి నిరూపించారు. ఆయన జనసేన పార్టీకి రూ. ఐదు కోట్ల విరాళం ఇచ్చినప్పుడే … కూటమికి మద్దతిచ్చారని అర్థమైపోతుంది. ఇప్పుడు కూటమి ఏర్పాడటం మంచి పరిణామం అని.. తన సన్నిహితులైన వారికి ఓటు వేయాలని కోరారు. ఇదే తప్పన్నట్లుగా చిరంజీవిపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు వైసీపీ నేతలు.

చిరంజీవి నుంచి వైసీపీ మద్దతు ఆశించడం లేదా ఆయన తటస్థంగా ఉడిపోవాలనుకోవడం వైసీపీ అత్యాశ. ఎందుకంటే జగన్ రెడ్డి సొంత చెల్లి కూడా ఆయనకు మద్దతుగా లేరు. ఆయనను ఓడించాలని పిలుపునిస్తున్నారు. అలాంటిది ప్రత్యర్థి పార్టీ నేత సోదరుడు.. అదీ కూడా ఆయన కుటుంబ సభ్యుడ్ని ఘోరంగా కించ పరుస్తున్న ముఖ్యమంత్రిపై చిరంజీవి కనీసం సాఫ్ట్ కార్నర్ కూడా ఉండదు. ఇంకా రెచ్చగొడితే ఆయన జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తే.. వైసీపీ నేతలకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close