ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన కావొచ్చు. అందుకే తనకు కాకపోయిన తన పిల్లలకు అయినా మేనమామలా ఇవ్వాలని ఆమె అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆస్తి గురించి అడుగుతారోనని పెళ్లికి కూడా వెళ్లడం మానేశారు. ఈ విషయం పక్కన పెడితే .. షర్మిల ఇలా రోడ్డున పడటం కన్నా న్యాయపోరాటం చేయవచ్చు కదా అనే సందేహం సహజంగానే చాలా మందికి వస్తుంది.

అన్న ఎన్టీఆర్ ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పిస్తూ చట్టం తెచ్చారు. ఆ చట్టం అమల్లో ఉంది. పిత్రార్జితంగా వచ్చిన ఆస్తిలో పిల్లలతో పాటు తల్లీకి వాటా ఉంటుంది. నిజానికి వైఎస్ సంపాదించిన ఆస్తులేమీ లేవు. ఆయన సీఎం అయ్యే ముందు కూడా హైదరాబాద్ లో ఉన్న ఇల్లును అమ్ముకోవాలనుకున్నారు. కానీ సీఎం పదవి వచ్చాక ఆయన దశ తిరిగిపోయింది. కానీ అదంతా అక్రమ సంపాదన. ప్రభుత్వ ఆస్తులను దోచి పెట్టి… సొంత ఖాతాలకు డబ్బులను పెట్టుబడుల రూపంలో జమ చేయించుకున్నారు. పైగా ఇందులో సూట్ కేస్ కంపెనీల్లో నే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి.

జగన్మోహన్ రెడ్డి నామినేషన్ తో పాటు ప్రకటించిన ఆస్తుల పత్రాలు చూస్తే.. లోటస్ పాండ్ ఎవరిది.. తాడేపల్లి ప్యాలెస్ ఎవరిది… యలహంక ప్యాలెస్ ఎవరిది .. బెంగళూరు మంత్రి మాల్ ఎవరిది… పులివెందుల….కడప సహా పలు నగరాల్లో ఉన్న ప్యాలెస్‌లు ఎవరివి అనే డౌట్ లు వస్తాయి. ఎందుకంటే అవేమీ జగన్ రెడ్డి పేరు మీద ఉండవు. సూట్ కేస్ కంపెనీల పేరుతో ఉంటాయి. వాటిని కోర్టుకెళ్లి జగన్ వే అని నిరూపించి న్యాయపోరాటం చేయలేరు. అందుకే షర్మిల రాజకీయంగా దెబ్బతీసి అయినా పంతం నెగ్గించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close