ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ – సంయుక్త క‌లిసి న‌టించ‌డం ఇదే తొలిసారి. రూ.50 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బెల్లంకొండ‌కు బాగా ఇష్ట‌మైన క‌థ ఇది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బెల్లంకొండ‌పై రూ.50 కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌డం పెద్ద రిస్క్‌. కానీ క‌థ‌పై న‌మ్మ‌కంతో నిర్మాత‌లు ఈ రిస్క్ చేయ‌డానికి ముందుకొచ్చారు. యేడాది పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రిగాయి. జూన్‌లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు.

సైన్స్ ఫిక్ష‌న్, సోషియోఫాంట‌సీ క‌ల‌గ‌లిపిన థ్రిల్ల‌ర్ ఇది. ఈ జోన‌ర్‌కు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆద‌ర‌ణ ఉంది. అందుకే ఈ సినిమానీ పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందిస్తున్నారు. న‌టీన‌టులు, ఇత‌ర టెక్నీష‌య‌న్ల ఎంపిక జ‌రుగుతోంది. టెక్నిక‌ల్ గా ఈ సినిమాని హై స్టాండ‌ర్డ్స్ లో తెర‌కెక్కించ‌డానికి మూన్ షైన్ పిక్చ‌ర్స్ అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఎవ‌రూ ఊహించ‌ని కొన్ని కాంబినేష‌న్లు కూడా ఈ సినిమాతో తెర‌పై క‌నిపించే అవ‌కాశం ఉంది. త్వ‌ర‌లోనే టైటిల్ తో పాటుగా, సినిమా వివ‌రాల్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close