ఆ బటన్లు నొక్కిన డబ్బులు రానట్లే – ఓటర్లకు మస్కా !

జనవరి నుంచి ఊరూరా వెళ్లి ఉత్తుత్తి బటన్లు నొక్కిన జగన్ రెడ్డి ఇప్పుడు పోలింగ్ రోజు వారి ఖాతాల్లో డబ్బులేసి ఓట్లు దండుకోవాలనుకున్నారు. ఈసీని మ్యానేజ్ చేసుకోవచ్చనుకున్నారు. అందుకే వచ్చిన డబ్బులు.. అప్పులు తెచ్చిన డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు చెల్లించేశారు. ఇప్పుడు లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేయాలంటే.. పోలింగ్ ముగియాలని ఈసీ చెప్పింది. కోర్టుకు వెళ్లినా ఈసీ చెప్పినట్లుగా చేయమని స్పష్టం చేసింది. మరోసారి ప్రభుత్వం నుంచి అప్లికేషన్ తీసుకున్నా… అత్యవసరంగా నిధులు జమ చేయాల్సిన అవసరం లేదని .. పోలింగ్ ముగిసిన తర్వాతనే చేయమని ఈసీ స్పష్టం చేసింది.

అంటే పథకాల లబ్దిదారులకు జగన్ జెల్లకొట్టినట్లే. కోడ్ రాక ముందే అందరి ఖాతాల్లో వేస్తే మర్చిపోతారని అనుకున్నారేమో కానీ పోలింగ్ రోజు లేదా ముందు రోజు వేద్దామనుకున్నరు.ఇప్పుడు ప్లాన్ రివర్స్ అయింది. ఓటు దాటాక అందరూ బోడి మల్లన్నలే. ఓటింగ్ పూర్తయిన తర్వాత జగన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయరు. ఏమైనా ఉంటే.. తమ అస్మదీయ కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకుంటారు.

గతంలో ఇలాగే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. పారిశ్రామిక సంస్థలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపై రగడ జరిగింది. కోడ్ అడ్డం ఉందని చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చినా ఇవ్వలేదు. ఇలాంటి విన్యాసాలు జగన్ రెడ్డి చాలా చేశారు. అందుకే పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్క రూపాయి కూడా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసే అవకాశమే లేదు. పోలింగ్ ముగియగానే ఆయన కుటుంబంతో సహా విదేశాలకు వెళ్తున్నారు. కౌంటింగ్ నాటికి కూడా వస్తారో లేదో ఎవరికీ తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close