క్యాడర్ హోప్స్ పెట్టుకోవద్దని హింట్స్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ క్యాడర్ ను ఆర్తికంగా చితికిపోకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. బెట్టింగులు కట్టి నష్టపోకుండా ఉండేందుకు ఆయన మెల్లగా హింట్స్ ఇస్తున్నారు. దాదాపుగా ప్రతి రోజూ ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన కౌంటింగ్ ప్రక్రియపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. కౌంటింగ్ అయినా సక్రమంగా జరుగుతుందా.. అని ఆయన దీర్ఘాలు పోతూ అనుమానాలు వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రక్రియను గుప్పిట్లో పెట్టుకునేందుకు సజ్జల ప్రయత్నాలు చేశారు. ఈసీ ఆదేశాలు అమలు కాకుండా చేయడంలో ఆయన గుప్పిట్లో ఉన్న అధికారులే కీలకం. గెలిచే అవకాశమే ఉంటే.. ఇలా దాడులు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి పోలీసు వ్యవస్థ చేతుల్లో ఉన్నప్పుడే కసి.. కక్ష తీర్చుకోవాలని డిసైడయ్యారు. ఆ పని చేశారు. పోలీసులు తర్వతా కఠిన చర్యలు తీసుకుంటారని.. ఇంకా ఈసీ చేతుల్లోనే పాలన ఉందని సజ్జలకు తెలియకుండా ఎలా ఉంటుంది ?. అందుకే ఈసీ టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాలు పాటించిందని సజ్జల అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామని చెప్పడానికి ఇంత కన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుందని వైసీపీ నేతలు కూడా గుసగుసలాడుకుంటున్నారు.

2019 ఎన్నికల సమయంలో టీడీపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. తమ పరిపాలన సంక్షేమ, అభివృద్ధి సమతూకంగా నడిచిందని ప్రజల మీద అసలు భారం వేయకుండా పాలన చేశామని అనుకున్నారు. అందుకే పార్టీ హైకమాండ్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చివరికి అది నమ్మకంతో సొంత పార్టీ క్యాడర్ బెట్టింగులు గట్టిగా పెట్టుకోవడానికి కారణం అయింది. అలా కూడా పార్టీ క్యాడర్ నష్టపోయింది. ఈ సారి అలాంటి పరిస్థితి వైసీపీ క్యాడర్ కు రాకుండా ఉండేందుకు సజ్జల ముందస్తుగా హింట్స్ ఇస్తున్నారని.. ఓటమికి కారణాలు చెబుతున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close