కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇందులో కుట్ర కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ పాలన అంతా రహస్యంగా సాగింది. జగన్ ప్రభుత్వం తాను తీసుకొచ్చిన జీవోల వివరాలు వెబ్ సైట్ లో ఉంచేది కాదు. ఆ విషయంలో హైకోర్టు నుంచి ఎన్నో మొట్టికాయలు తిన్నది. 2008లో ప్రారంభం అయిన జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌ను జగన్‌ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత పూర్తిగా మూసేశారు. ప్రతీ జీవో గతంలో జీవోఐఆర్ లో ప్రభుత్వం బహిరంగంగా పెట్టేది. సామాన్యులు ఎవరైనా ఆ వెబ్ సైట్ ను చాలా ఈజీగా చూడవచ్చు. జీవోలు డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. కానీ, జగన్ ప్రభుత్వం మాత్రం ఆ సైటు మూసేసింది.

ప్రభుత్వ నిర్ణయాల తాలూకు డేటా, ఫైల్స్ అన్నీ ఈ-ఆఫీ్‌సలో ఉంటాయి. ఇప్పుడు దీన్నే సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ పేరుతో మూసేస్తున్నారు. ఏపీ సర్కార్ పాలన పేరుతో వ్యాపారం చేసిందని.. కమిషన్లు దండుకుని నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మారితే ఇరుక్కోకుండా అన్ని క్లియర్ చేసుకుందామన్న ఆలోచనలోనే సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో.. ప్రభుత్వం ఆపద్ధర్మంగా ఉన్నప్పుడు క్లోజ్ చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close