ఈసీని నేరుగా బెదిరిస్తున్న పేర్ని నాని

వైసీపీ నేతలు క్రమంగా కంట్రోల్ తప్పి పోతున్నారు. కౌంటింగ్ ఎలా సక్రమంగా సాగుతుందో చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈసీ ఆఫీసు ముంద పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వివ్న ఎవరికైనా.. కౌంటింగ్ విషయంలో వైసీపీ చాలా పెద్ద కుట్రలే పన్నుతున్నదని అర్థమవుతుంది. ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికల పక్రియ గందరగోళంగా.. ఘర్షణ వాతావరణంలోకి మారబోతోదంని దీనికి ఈసీదే బాధ్యత అని పేర్ని చెప్పుకొచ్చారు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో టీడీపీ చేసిన అభ్యర్థనను అంగీకరించడం అంట.

పోస్టల్ బ్యాలెట్స్ ఐదున్నర లక్షల వరకూ పోలయ్యాయి. చాలా బ్యాలెట్స్ పై రిటర్నింగ్ అధికారులు సీలు వేసి సంతకం చేయాలి.. కానీ రిటర్నింగ్ అధికారులు చాలా వరకూ ఆ పని చేయకుండా వదిలేశారు. ఆర్వోలు చేసిన తప్పునకు.. ఉద్యోగుల ఓట్లు ఎందుకు వృధా కావాలని అలాంటి ఓట్లను పరిగణించాలని టీడీపీ కోరింది. ఈసీ అంగీకరించి మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. దీన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఏ రాష్ట్రంలో లేని నిబంధనలు ఏపీలో ఎందుకు ఒప్పుకున్నారని.. వెంటనే.. ఆ రూల్స్ ను వెనక్కి తీసకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరుక సీఈవో కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చిన పేర్ని నాని బయట మీడియాతో ఈ హెచ్చరికలు జారీ చేశారు.

కౌంటింగ్ రోజున ఇండిపెండెంట్ అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లుగా తమ నేతల్ని పంపి.. రచ్చ చేయించే ప్రణాళికను వైసీపీ వేస్తోందని ఇప్పటికే అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటలిజెన్స్ కూడా ఈ అంశంపై సమాచారం ఇచ్చిందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో పేర్ని నాని వ్యాఖ్యలు ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పోలీసులు కౌంటింగ్ రోజు మరిన్ని కఠినమైన చర్యలు .. కౌంటింగ్ కేంద్రం లోపల చేపట్టాల్సి ఉంటుందేమో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close