వైసీపీపై గురి పెట్టిన బీజేపీ – ఏం జరగబోతోంది ?

నెక్ట్స్ ఆపరేషన్ లోటస్ కు బలయ్యేది వైసీపీనే అని చిదంబరం కుమారుడు.. తమిళనాడు ఎంపీ కార్తీ చిదంబరం ఓ ట్వీట్ పెట్టారు. ఆయనకు ఏదో సమాచారం లేకపోతే … ఏపీ రాజకీయాలు.. అదీ వైసీపీ గురించి ట్వీట్ పెట్టాల్సిన అవసరం లేదు. అయితే అదేమిటి అయి ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది.

వైసీపీకి నలుగురు లోక్ సభ సభ్యులు ఉన్నారు. పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సమీప భవిష్యత్ లో ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ లేదా ఓ రాజ్యసభ ఎంపీ సీటు వచ్చే అవకాశాలు లేవు. బీజేపీకి రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది. టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని గతంలో విలీనం చేసుకున్నట్లుగా ఇప్పుడు రాజ్యసభ సభ్యుల్ని విలీనం చేసుకునే ప్రక్రియ ఏమైనా ప్రారంభించారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

వైసీపీ రాజ్యసభ సభ్యులేం పార్టీకి వీర విధేయులు కాదు.. వ్యాపార ప్రముఖులే ఎక్కువ. పరిమళ్ నత్వానీ వైసీపీ, కృష్ణయ్య వంటి వాళ్లు బీజేపీ పిలిస్తే పరుగున వెళ్తారు. బీద మస్తాన్ రావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సహా విజయసాయిరెడ్డి అందరూ లైన్‌లోనే ఉంటారు. ఎందుకంటే… బీజేపీ రావాలంటే.. రాలేమని చెప్పే పరిస్థితి ఉండనంత లగేజీ వీరికి ఉంది.

తమ ఎంపీలంతా వెళ్లి వైసీపీలో చేరినా జగన్ మోహన్ రెడ్డికి నోరెత్తే పరిస్థితి లేదు. ఆయన బలహీనతను ఆసరా చేసుకుని బీజేపీ ఏదో చేయబోతోంది. అదేంటో… ఒకటి, రెండు నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close