ద్వివేదికి ఉద్వాసన – జగన్ సర్వీస్ బ్యాచ్‌పై ప్రజా నిరసన !

వైసీపీ హయాంలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ప్రతిపక్షాన్ని వేధించడమే తమ విధిగా పెట్టుకున్నారు. పాలకులకు దోచి పెట్టడమే పనిగా చేశారు. ఇలాంటి అధికారులకు ఇప్పుడు ఉక్కపోత ప్రారంభమయింది. అయితే వారి సీనియారిటీ.. తాము జగన్ రెడ్డి చెప్పినట్లే చేశామని … తమను కూడా బెదిరించారని ఏదో ఒక కారణం చెప్పి ప్రస్తుత ప్రభుత్వ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తప్పు చేసిన వాళ్లను శిక్షించాల్సిందేనన్నట్లుగా ప్రజాభిప్రాయం ఉండటంతో ప్రభుత్వ పెద్దలు జాలి చూపిస్తున్నా వారికి ఊరట లభించడం లేదు.

అధికారం చేపట్టిన తర్వాత కొంత మంది జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారుల్ని పక్కకు తప్పించారు. అయితే గోపాల కృష్ణ ద్వివేదీని మాత్రం గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగిస్తూ అదనపు శాఖలు ఇచ్చారు. దీనిపై టీడీపీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం అయింది. ఎందుకంటే వైసీపీ గనుల దోపిడికి ఆయన ప్రత్యక్షంగా సహకరించారు… అంతే కాదు ఎన్నో సార్లు కోర్టు ధిక్కరణ శిక్షలకు గురయ్యారు. అదే సమయంలో టీడీపీ పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారు. ఓ సందర్భంలో చంద్రబాబు ఆయన ఎదురుగా కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అలాంటి అధికారికి మళ్లీ ప్రాధన్యం ఇవ్వడం ఏమిటన్న ప్రశ్నలు ప్రజల నుంచి వచ్చాయి.

ఇంత మంచితనం పనికి రాదని… మంచితనాన్ని చేతకాని తనం అనుకునే ప్రమాదం ఉందని ఫీడ్ బ్యాక్ రావడంతో ప్రభుత్వం స్పందించక తప్పలేదు. గనుల శాఖ నుంచి ద్వివేదిని తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కార్మిక కర్మాగాల బాయిలర్ల శాఖ కార్యదర్శిగా మాత్రమే కొనసాగుతారు. నిజానికి ప్రధాన పోస్టుల కోసం సీనియార్టీ ఉన్న అధికారులంతా జగన్ చెప్పినట్లుగా చేసి నిండా మునిగిపోయారు. అయితే వారిలో కొంత మంది అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో సీరియస్‌గా.. సిన్సియర్‌గా పని చేసిన వారే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close