సాక్షిలో వైసీపీ యాడ్స్ – పెద్ద స్కెచ్చే !

జగన్ రెడ్డి తనకు పేపర్లు, టీవీలు లేవంటారు కానీ ఆయన సతీమణి భారతి రెడ్డికి ఉన్నాయి. సాక్షి పత్రిక, టీవీలను ఆమే నడుపుతారు. ఆ పత్రిక , టీవీల్లో వచ్చేదంతా వైసీపీ వార్తలే. అయితే వైసీపీని, జగన్ ను ఆకాశానికెత్తడం లేకపోతే ఇతర పార్టీల నేతల మీద బూతులందుకోవడం. అంటే.. పేపర్ మొత్తం.. వైసీపీ ప్రకటనలే.. వార్తల రూపంలో వస్తాయి. కానీ ఇప్పుడు విచిత్రంగా వైసీపీ పేరుతో ఓ అధికారిక ప్రకటన వచ్చింది. మొదటి పేజీలో ఫుల్ పేజీ యాడ్ ను.. వైసీపీ ఇచ్చింది.

చంద్రబాబు ప్రభుత్వం ఒకటో తేదీన పెన్షన్లను పంపిణీ చేసింది. ఆ సమయంలో ప్రభుత్వం అబద్దం చెప్పిందంటూ… ఇవీ నిజాలంటూ.. తాము చెప్పేవి ఫుల్ పేజీ యాడ్ ఇచ్చేసింది. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ప్రకటనలు కూడా అలా లేవు. కానీ ఎవరో సోషల్ మీడియాలో విమర్శలు చేశారనో.. మరో కారణమో తీసుకుని ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చింది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే … పుల్ పేజీ ప్రకటన కన్నా ఓ న్యూస్ ఐటమ్ పవర్ ఫుల్. సాక్షితరపున వార్త రాసి ఫ్రంట్ పేజీలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పటచి వరకూ అదే చేశారు. మరి ఇప్పుడెందుకు ప్రకటనలు ఇస్తున్నారన్నది సస్పెన్స్ గా మారింది.

అయితే అసలు స్కెచ్ ఇక్కడే ఉందని సాక్షి ఇన్ సైడ్ లో ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వం లో జగన్ రెడ్డి ప్రజల సొమ్మును సాక్షికి ధారబోశారు. నెలకు పది కోట్లు చందాల రూపంలో… వంద కోట్లకుపైగా ప్రకటనల రూపంలో సాక్షికి వెళ్లేవి. ఇందులో పార్టీ నేతలు ఇచ్చే ప్రకటనలు ఉంటాయి. అయితే ఇవి గత నెల మొత్తం ఆగిపోయాయి. అంటే.. మొత్తం ఆదాయం పడిపోయిది. మామూలుగా వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఇప్పుడు తమకు ప్రకటనల ఆదాయం వస్తుందని చెప్పుకోవడానికి అయినా ఇలా వైసీపీ పార్టీ ఫండ్ ను సాక్షి పత్రికకు మళ్లిస్తున్నారని అంటున్నారు. ముందు ముందు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున సాక్షికి ప్రకటనలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెల‌స‌రి సెల‌వులపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

ఆయా కంపెనీల్లో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగుల నెల‌స‌రి సెలవుల‌ను త‌ప్ప‌నిసరి చేయాల‌న్న పిటిష‌న్ పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు మంచివే కానీ అది వారి భ‌విష్య‌త్ కు...

గుడ్ న్యూస్… ఏపీలో ఫ్రీగా ఇసుక‌-జీవో జారీ

ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019, 2021 సంవ‌త్స‌రాల్లో ఇచ్చిన ఇసుక పాల‌సీల‌ను ర‌ద్దు చేస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా విధివిధానాలు 2024వ‌రకు అందుబాటులో...

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

నామినేటెడ్ పోస్టుల పంపకాలపై లోకేష్ కసరత్తు

ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close