కంట్రోల్.. కంట్రోల్ టీడీపీ లీడర్స్

మంత్రి గారి భార్య పోలీసులపై చేసిన రుబాబు వీడియోతో సహా వెలుగులోకి వచ్చింది. అదేదో కావాలని సన్నివేశాన్ని సృష్టించుకున్నట్లుగా ఉంది. వీడియో పక్కాగా ఉంది. ఈ వ్యవహారంతో కడప మంత్రి రాంప్రసాద్ రెడ్డికి తొలి ఇన్నింగ్స్ లోనే మచ్చ పడింది. చంద్రబాబునాయుడు కూడా వెంటనే సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగులు, పోలీసుల పట్ల అలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైసీపీ హయాంలో ఇలాంటివి కామన్. పోలీసుల్ని .. పోలీస్ స్టేషన్ లోనే కొట్టినా పట్టించుకునేవారు ఉండరు. కేసులు ఉండవు. రివర్స్ లో పోలీసులపైనే కేసులు పెట్టేవారు. కానీ వైసీపీ చేసిందని.. టీడీపీ చేస్తే పెద్ద తేడా ఏముందన్న అభిప్రాయం బలపడుతుంది.

అధికారం అందిన అహంలో తాము ఏం చేసినా బండి నడుస్తుందని టీడీపీ నేతల కుటుంబసభ్యులు అనుకుంటారు. వారిని కంట్రోల్ చేయాల్సింది బాధ్యతల్లో ఉన్న వారే. తాము చేసే పనుల వల్ల తమకు ఎలాంటి మేలు జరగకపోగా పార్టీకి నష్టం వస్తుంది. అధికారం లేని దర్పం ప్రదర్శిస్తే ప్రజలకు కూడా దుర్వినియోగం చేస్తున్నారన్న కోపం పెరుగుతుంది. మంత్రికి తప్ప ఆయన కుటుంబసభ్యులకు ప్రోటోకాల్ ఉండదు. ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఓ జిల్లాకు మంత్రి అంటే.. కుటుంబ సభ్యులు కూడా తామే మంత్రులం అన్నట్లుగా వ్యవహరించడం కామన్‌గా మారిపోయింది.

ఈ పరిస్థితిని ఇప్పుడు మార్చాల్సి ఉంది. అధికారం అనేది ప్రజలు ఇచ్చేది. ప్రజలు దుర్వినియోగం చేస్తే మళ్లీ లాగేసుకుంటారు. చరిత్ర ఇదే చెబుతోంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని టీడీపీ కూటమి నేతలు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. ఉద్యోగులు తప్పు చేసినా వారిని దూషించడానికి రాజకీయ నేతలకు అవకాశం లేదు. చట్టప్రకారం… సర్వీస్ రూల్స్ ప్రకారం వారు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా తామే తప్పు చేస్తే… ప్రజల శిక్షకు గురవుతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అడుసు తొక్కనేలా.. కోర్టుల చుట్టూ తిరగనేలా?

వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా హైకోర్టు వైపు పరుగులు పెడుతున్నారు. ఒకరు ముందస్తు బెయిల్ కావాలని.. మరొకరు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని.. ఇంకొందరూ అదే లైన్ లో ఉన్నారు. వరుసగా వైసీపీ నేతలు...

కేటీఆర్‌ పాదయాత్ర చేయాలంటున్న క్యాడర్

భారత రాష్ట్ర సమితి క్యాడర్ లో ఉనికి బయం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో ఒకటి చేయాలని.. ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని హైకమాండ్ పై ఏదో రూపంలో ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా...

రెండు, మూడు నెలల జైలుకు జోగి రమేష్ రెడీ

మాజీ మంత్రి జోగి రమేష్ జైలు కోసం మానసికంగా రెడీ అయిపోతున్నారు. ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని గంట గంటకూ బయపడటం కన్నా ఓ రెండు నెలల పాటు జైలుకు ఫిక్సయిపోతే పోతుంది...

ఊహాలోకంలో జగన్..ఎదురుదెబ్బలు తప్పవా?

తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లుగా మారింది జగన్ రెడ్డి పరిస్థితి. ఓటమి నుంచి తేరుకొని మెల్లగా పొలిటికల్ ట్రాక్ ఎక్కబోతున్నామని సంబరపడుతున్న వైసీపీకి త్వరలోనే బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close