ప్రజాభవన్‌లోనే చంద్రబాబు- రేవంత్ భేటీ

చంద్రబాబు ఆహ్వానానికి రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. నేనే వస్తానన్న చంద్రబాబు మాటకు తగ్గట్లుగా ప్రజాభవన్‌లోనే సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాభవన్ అే పేరును కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరారు చేశారు. అంతకు ముందు అది ప్రగతి భవన్.కేసీఆర్ నివాసం. అక్కడే జగన్, కేసీఆర్ లు పలుమార్లు సమావేశం అయ్యారు. ఇప్పుడు వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి కూడా సమావేశానికి అదే ఖరారు చేశారు.

నాటి ప్రగతి భవన్ నేటి ప్రజా భవన్‌లో మూడు భవనాలు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ నివాసం. అందులో ప్రస్తుతం భట్టి విక్రమార్క ఉంటున్నారు. రెండోది అధికారిక సమావేశాల కోసం.. ఉంటుంది. అందులోనే సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ భవన్ లో సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉందని భవిస్తున్నారు. జగన్ గెలిచిన తర్వాత ప్రగతి భవన్ కు వచ్చారు. మూడు, నాలుగు సార్లు మీటింగ్‌లు జరిగాయి కానీ ఏవీ అధికారిక సమావేశాలు కాదు. ప్రైవేటుగా చర్చించుకుని వెళ్లిపోయేవారు.

ఒక్క సారి మాత్రం.. రెండు రాష్ట్రాల కలిసి కాళేశ్వరం లాంటి బడా ప్రాజెక్టు కట్టాలని ప్రణాళికలు వేశాయి. ఓ రెండు లక్షల కోట్ల అప్పును రుద్దేయాలని ప్లాన్ చేసుకున్నారు. పోలవరాన్ని ఆపేయాలనుకుున్నారు. కానీ ఎందుకో ఆ ప్లాన్ ముందడుగు పడలేదు. ఇప్పుడు చంద్రబాబు , రేవంత్ మధ్య అధికారిక సమావేశం జరగనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెల‌స‌రి సెల‌వులపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

ఆయా కంపెనీల్లో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగుల నెల‌స‌రి సెలవుల‌ను త‌ప్ప‌నిసరి చేయాల‌న్న పిటిష‌న్ పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు మంచివే కానీ అది వారి భ‌విష్య‌త్ కు...

గుడ్ న్యూస్… ఏపీలో ఫ్రీగా ఇసుక‌-జీవో జారీ

ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019, 2021 సంవ‌త్స‌రాల్లో ఇచ్చిన ఇసుక పాల‌సీల‌ను ర‌ద్దు చేస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా విధివిధానాలు 2024వ‌రకు అందుబాటులో...

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

నామినేటెడ్ పోస్టుల పంపకాలపై లోకేష్ కసరత్తు

ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close