మంత్రివర్గ విస్తరణలో బిగ్ ట్విస్ట్!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఖాయం కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. చాలామంది నేతలు మంత్రి పదవులను ఆశిస్తుండటంతో కేబినెట్ లో ఎవరికి ఛాన్స్ దక్కుతుందోనని వెయిట్ చేస్తున్నారు. మొదట ఈ నెల7న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తంగా ఖరారు చేసినా 5వ తేదీ తర్వాత అమావాస్య, ఆషాడమాసం వస్తుండటంతో నిర్ణయం మార్చుకున్నారని… గురువారమే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ జరుగుతోంది.

మంత్రి పదవుల కోసం ఆశావహులు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ కూర్పు ఫైనల్ కాగా,ఏఐసీసీ పెద్దల పరిశీలన అనంతరం అధికారికంగా పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. అయినా నేతలు తమ ప్రయత్నాలను ఆపడం లేదు. కేబినెట్ లో ఆరు స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉన్నా, ప్రస్తుతం నలుగురిని తీసుకుంటారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార విషయంపై చర్చించేందుకే గవర్నర్ తో సీఎం రేవంత్ భేటీ అయినట్లు రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. సీతక్క శాఖ మార్పు ఖాయమని ఆమెకు హోంశాఖను కట్టబెడుతారని పార్టీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి.

కేబినెట్ లో కొత్తగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వివేక్ , ఓ మైనార్టీ నేతకు అవకాశం దక్కవచ్చునని టాక్ వినిపిస్తోంది. గవర్నర్ తో సీఎం , అసెంబ్లీ కార్యదర్శి భేటీతో కేబినెట్ విస్తరణ ఖాయమని విస్తృతంగా ప్రచారం జరుగుతోన్నా .. ఇదంతా మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని అసెంబ్లీ వర్గాలు పేర్కొనడటం గమనార్హం. దీంతో కేబినెట్ విస్తరణ ఉంటుందా..? అనే సందిగ్ధం నెలకొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెల‌స‌రి సెల‌వులపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

ఆయా కంపెనీల్లో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగుల నెల‌స‌రి సెలవుల‌ను త‌ప్ప‌నిసరి చేయాల‌న్న పిటిష‌న్ పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు మంచివే కానీ అది వారి భ‌విష్య‌త్ కు...

గుడ్ న్యూస్… ఏపీలో ఫ్రీగా ఇసుక‌-జీవో జారీ

ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019, 2021 సంవ‌త్స‌రాల్లో ఇచ్చిన ఇసుక పాల‌సీల‌ను ర‌ద్దు చేస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా విధివిధానాలు 2024వ‌రకు అందుబాటులో...

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

నామినేటెడ్ పోస్టుల పంపకాలపై లోకేష్ కసరత్తు

ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close