పెను విషాదం..మట్టి కాదు మరణ శాసనం!

భోలే బాబా పాద ధూళితో జీవితాలు మెరుగుపడుతాయని ఆ భక్తులంతా ఆశపడ్డారు. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన వెతలు తీరుతారని బాబా పాదధూళి కోసం ఎగబడ్డారు. కానీ, ఆ మట్టికోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన యూపీలోని హత్రాస్ జిల్లా ఫుల్ రయీలో చోటు చేసుకుంది.

ప్రసిద్ది చెందిన భోలే బాబా దర్శనం కోసం మంగళవారం భక్తులంతా ఒక్కసారిగా ఎగబడటం..బాబా పాదధూళి సేకరించే ప్రయత్నంతో ఊహించని విధంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో 116మంది మృతి చెందగా.. వందల మంది గాయపడ్డారు. మృతుల్లో 108మంది మహిళలు, 7చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

భోలే బాబా సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. మంగళవారం చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. బాబా పాదధూళి సేకరించేందుకు పెద్దఎత్తున ఒకేసారి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలు ఎక్కడికక్కడ చెల్లాచెదురై పడి ఉండటం, మృతదేహాల పక్కనే స్పృహ కోల్పోయిన వారు ఉండటం.. క్షతగాత్రులు సహాయం కోసం ఎదురు చూస్తుండటం..ఈ హృదయవిదారక దృశ్యాలు అందర్నీ కలిచివేశాయి.

హాహాకారాలతో ఆసుపత్రి ప్రాంగణం పెను విషాదమయంగా మారింది. మృతుల కుటుంబాల ఆర్తనాదాలు స్థానికుల హృదయాలను బరువెక్కించాయి. బాబా మట్టి మిమ్మల్ని అదే మట్టిలో పాతిపెట్టిందంటూ మృతుల బంధువులు రోదించడం తీవ్రంగా కలిచివేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెల‌స‌రి సెల‌వులపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

ఆయా కంపెనీల్లో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగుల నెల‌స‌రి సెలవుల‌ను త‌ప్ప‌నిసరి చేయాల‌న్న పిటిష‌న్ పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు మంచివే కానీ అది వారి భ‌విష్య‌త్ కు...

గుడ్ న్యూస్… ఏపీలో ఫ్రీగా ఇసుక‌-జీవో జారీ

ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019, 2021 సంవ‌త్స‌రాల్లో ఇచ్చిన ఇసుక పాల‌సీల‌ను ర‌ద్దు చేస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా విధివిధానాలు 2024వ‌రకు అందుబాటులో...

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

నామినేటెడ్ పోస్టుల పంపకాలపై లోకేష్ కసరత్తు

ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close