ఏడు మండలాల కథకు.. ఎండ్ కార్డు పడేనా?

ఈ నెల ఆరో తేదీన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. పదేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న విభజన సమస్యలకు పరిష్కామే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది. ఎజెండాలో చాలా అంశాలు కనిపిస్తున్నప్పటికీ.. ప్రధానంగా ఏపీలో విలీనమైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపేలా చంద్రబాబును ఒప్పించాలని రేవంత్ ను బీఆర్ఎస్ కోరుతోంది.

నిజానికి ఆ ఏడు మండలాల ప్రజలు తెలంగాణలో విలీనం కావాలనే కోరుకుంటున్నారు. పలుమార్లు ఈ విషయాన్ని బయటపెట్టారు. కానీ, అప్పట్లో ఈ అంశాన్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్ అండ్ జగన్ రెడ్డిలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం, ఎన్డీయేలో చంద్రబాబు కీలకంగా ఉండటం.. విభజన సమస్యలకు పరిష్కారం కోసం ఆయన వైపు నుంచి సానుకూలత రావడంతో విభజన సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశలు చిగురిస్తున్నాయి.

దీంతో ఏడు మండలాల విషయంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారు..? ఈ విషయంలో రేవంత్, చంద్రబాబును ఎలా ఒప్పిస్తారు..? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే, ప్రజల కోరిక మేరకు ఏడు మండలాలను తెలంగాణలో విలీనం విషయంలో చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తే మాత్రం అది రాజకీయాల్లో కొత్త చరిత్రకు నాంది అవుతుంది. అదే సమయంలో గతంలో ఇలాంటి చొరవ ప్రదర్శించలేదని బీఆర్ఎస్ పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపనుండగా.. కాంగ్రెస్ , టీడీపీలపై ఏడు మండలాల ప్రజల్లో సదాభిప్రాయం నెలకొనే అవకాశం ఉంటుంది.

ఇదే వైఖరితో మిగిలిన విభజన సమస్యలను ఓ కొలికి తీసుకువస్తారనే అంచనాకు ఇది శుభారంభం కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గేమ్ ఛేంజ‌ర్‌… శంక‌ర్ కు క్లారిటీ లేదా?

గేమ్ ఛేంజ‌ర్ ఎప్పుడు? ఇది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఈ సినిమా గురించి ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. దిల్ రాజుని ఎప్పుడు రిలీజ్ డేట్ గురించి...

నెల‌స‌రి సెల‌వులపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

ఆయా కంపెనీల్లో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగుల నెల‌స‌రి సెలవుల‌ను త‌ప్ప‌నిసరి చేయాల‌న్న పిటిష‌న్ పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు మంచివే కానీ అది వారి భ‌విష్య‌త్ కు...

గుడ్ న్యూస్… ఏపీలో ఫ్రీగా ఇసుక‌-జీవో జారీ

ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019, 2021 సంవ‌త్స‌రాల్లో ఇచ్చిన ఇసుక పాల‌సీల‌ను ర‌ద్దు చేస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా విధివిధానాలు 2024వ‌రకు అందుబాటులో...

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close