అయిననూ ద్వారంపూడి మారలే!

ప్రభుత్వం మారినా, పవర్ చేజారినా కొంతమంది వైసీపీ నేతలు మాత్రం ఇంకా దూకుడు తగ్గించడం లేదు. ఇటీవల దమ్ముంటే తమను టచ్ చేసి చూడాలంటూ కొడాలి నాని కేవలం వ్యాఖ్యలకు మాత్రమే పరిమితమైతే తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి యాక్షన్ లోకి దిగిపోయారు.

కాకినాడలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా, భవన నిర్మాణం చేపడుతుండటంతో ద్వారంపూడి అనుచరుడికి అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా నోటీసులకు స్పందించకపోవడంతో భవనం కూల్చివేతకు అధికారులు ఉపక్రమించడంతో ద్వారంపూడి సంఘటన స్థలంకు చేరుకొని హల్చల్ చేశారు. పోలిసులను తోసుకుంటూ అక్రమ కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

నిబంధనలకు విరుద్దంగా భవన నిర్మాణాలు చేపట్టడమే తప్పు. అలాంటిది వాటి కూల్చివేతకు అధికారులు ఉపక్రమిస్తే ద్వారంపూడి రౌడీయిజం చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే ఆయన రేషన్ దందాపై కూటమి ప్రభుత్వం యాక్షన్ ప్రారంభించిందని, ఈ విషయంలో త్వరలోనే ఆయన ఇబ్బందులు ఎదుర్కోక తప్పేలా లేదు. అయినప్పటికీ ద్వారంపూడి ఇంకా తగ్గేదేలే అంటూ నానా యాగీ చేయడం చర్చనీయాంశం అవుతోంది.

ద్వారంపూడి ఏ ధైర్యంతో ఇలా రెచ్చిపోతున్నారు..? అనే చర్చ జరుగుతోంది. పవర్ పోయినా ద్వారంపూడి దౌర్జన్యం కొనసాగిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నేతల ఆటకట్టించకపోతే గతంలో ఓవరాక్షన్ చేసిన వైసీపీ నేతలూ ఇదే పంథాను ఫాలో అవుతారని అంటున్నారు. అందుకే ఇలాంటి నేతల పట్ల సాధ్యమైన మేర చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ లు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపకు ఉపఎన్నికలు వస్తే ప్రచారం చేస్తా : రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షర్మిల కోసం నేరుగా రంగంలోకి దిగుతానని ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వైఎస్ జయంతి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కడపకు ఉప...

బీజేపీతో అంటకాగేవాళ్లు వైఎస్ వారసులా ? : షర్మిల

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో ఆయనకు తానే రాజకీయ వారసురాలినని షర్మిల నేరుగా సందేశం ఇచ్చారు. ఇవ్వాళ YSR వారసుడు అని చెప్పుకొనే వాళ్ళు BJP...

డ్ర‌గ్స్‌పై పోరుకు టాలీవుడ్ సిద్ధం

డ్ర‌గ్స్ మహ‌మ్మారిని త‌రిమికొట్టేలా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకొంటోంది. డ్ర‌గ్స్‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి కొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. ఈ ఉద్య‌మంలో చిత్ర‌సీమ కూడా పాలుపంచుకోవాల‌ని ఇటీవ‌ల తెలంగాణ సీఎం...

అడుసు తొక్కనేలా.. కోర్టుల చుట్టూ తిరగనేలా?

వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా హైకోర్టు వైపు పరుగులు పెడుతున్నారు. ఒకరు ముందస్తు బెయిల్ కావాలని.. మరొకరు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని.. ఇంకొందరూ అదే లైన్ లో ఉన్నారు. వరుసగా వైసీపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close