బ‌న్నీ వెనుక హైప‌ర్ ఆది.. ఇది స‌రిపోదేమో..?!

మెగా హీరోల్లో బ‌న్నీ వేర‌యా అన్న‌ట్టుంది ప‌రిస్థితి. ఎప్ప‌టిక‌ప్పుడు బ‌న్నీకీ మిగిలిన హీరోల‌కూ ఓర‌క‌మైన గ్యాప్ క‌నిపిస్తుంటుంది. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో. ‘చెప్ప‌ను బ్ర‌ద‌ర్‌’ అనే కామెంట్ ద‌గ్గ‌ర్నుంచి మొన్న‌టి ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ వ్య‌తిరేక వ‌ర్గానికి ప‌నిగ‌ట్టుకొని వెళ్లి ప్ర‌చారం చేసొచ్చే వ‌ర‌కూ… ఈ ‘దూరం’ క‌నిపిస్తూనే ఉంది. అందుకే మెగా అభిమానులు కొంత‌మంది బ‌న్నీని విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో కూట‌మి గెలిచింది. ప‌వ‌న్ అసెంబ్లీలో అడుగుపెట్టాడు. మంత్రి కూడా అయ్యాడు. ప‌వ‌న్ త‌న శ‌త్రువుల్ని కూడా క్ష‌మించేసి, ఎప్ప‌టిలా త‌న ప‌ని తాను చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు. కానీ ప‌వ‌న్ అభిమానులు మాత్రం గ‌తం మ‌ర్చిపోలేదు. బ‌న్నీని ఏదోలా టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

అయితే బ‌న్నీ జాతీయ అవార్డు గ్ర‌హీత అని, త‌న‌ని ట్రోల్ చేయ‌డం మానుకోవాల‌ని, మెగా హీరోలంతా ఒక్క‌టేన‌ని, వాళ్లెప్పుడూ క‌లిసే ఉంటార‌ని, ఇలా ట్రోలింగ్ చేయ‌డం వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని తాజాగా హైప‌ర్ ఆది చేసిన వ్యాఖ్య‌లు బాగా వైర‌ల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా ప‌వ‌న్ కు బాగా ద‌గ్గ‌రైన వ్య‌క్తి హైప‌ర్ ఆది. ఎన్నిక‌ల స‌మ‌యంలో పిఠాపురం వెళ్లి ప్ర‌చారం చేసి వ‌చ్చాడు. వైకాపా నేత‌ల్ని త‌న స్పీచుల‌తో ఆడుకొన్నాడు. ఇప్పుడు ఆది.. బ‌న్నీకి స‌పోర్ట్ గా నిలిచాడు. అయితే.. హైప‌ర్ ఆది చెప్పినంత మాత్రాన మెగా ఫ్యాన్స్‌, బ‌న్నీ హేట‌ర్స్ ఇప్పుడు త‌మ స్పీడు తగ్గించుకొంటార‌ని అశించ‌లేం. మెగా హీరోల్లో ఎవ‌రైనా ముంద‌డుగు వేసి, ఈ గ్యాప్ ని స‌రిదిద్దాలి. చిరంజీవి లేదంటే రామ్ చ‌ర‌ణ్ మీడియా ముందుకొచ్చిన‌ప్పుడు ఈ అంశం ప్ర‌స్తావించాలి. తామంతా ఒక్క‌టేన‌ని చాటిచెప్ప‌గ‌ల‌గాలి. అప్పటికి గానీ ఈ ట్రోలింగ్ ఆగేలా లేదు. కానీ… అది జ‌రుగుతుందా? అనేది అనుమాన‌మే.

Also Read : మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఎందుకంటే ఇప్ప‌టికే నాగ‌బాబు బ‌న్నీపై గుర్రుగా ఉన్నాడు. ‘మ‌న వెనుక ఉండేవాళ్లే మ‌న‌వాళ్లు’ అనే అర్థం వ‌చ్చేలా గ‌తంలోనే ప‌రోక్షంగా బ‌న్నీని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏం జ‌రిగిందో చిరు, చ‌ర‌ణ్‌ల‌కు తెలుసు. చ‌ర‌ణ్ త‌న బిజీ షెడ్యూల్ లో కూడా ప‌నిగ‌ట్టుకొని పిఠాపురం వెళ్లాడు. బాబాయ్ కి త‌న మ‌ద్ద‌తు తెలిపాడు. ఇప్పుడు వాళ్లు త‌మంత‌ట తాము వ‌చ్చి ప‌రిస్థితి చెక్క‌బెట్టే అవ‌కాశాలు ఏమాత్రం లేవు.

ఈ గ్యాప్ బ‌న్నీకి అంత మంచిది కాదు. త‌న సినిమాలకు అస్స‌లు మంచిది కాదు. ఇప్ప‌టికే ‘పుష్ష 2’ని బాయ్ కాట్ చేయాల‌ని కోస్తా జిల్లాల్లోని మెగా అభిమానులు త‌మ వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపుకొంటున్నారు. ఆ నిర‌స‌న అర్థ‌మ‌య్యే ఆగ‌స్టు 15న రావాల్సిన ‘పుష్ష 2’ వాయిదా వేశార‌న్న‌ ఊహాగానాలూ ఉన్నాయి. అదెంత వ‌ర‌కూ నిజ‌మో తెలీదు కానీ, బ‌న్నీకి మెగా అభిమానుల సెగ మాత్రం పొంచి ఉంది. ఈ సున్నిత‌మైన విష‌యాన్ని బ‌న్నీ ఎలా దాటుకొస్తాడో, అందుకోసం అల్లు అర‌వింద్ ఎలాంటి వ్యూహాలు ర‌చిస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close