జగన్ ఇంట్లోకి మీడియా కెమెరాలకు నో ఎంట్రీ !

జగన్ మోహన్ రెడ్డి ఇంటికి అరకిలోమీటర్ దూరం నుంచే సెక్యూరిటీ ఉంటుంది. కేవలం అనుమతి ఉన్న వారికే అక్కడ్నుంచి ముందుకెళ్లగలరు. అయిత అది జూన్ నాలుగో తేదీ వరకే. ఇప్పుడు ఆయన ఇంటి ముందు పిల్లలు క్రికెట్ ఆడుకోవచ్చు. కానీ ఆయన ఇంట్లోకి మాత్రం.. ఎవరికీ అనుమతి ఉండదు. మీడియాకు ఎప్పుడూ లేదు. ఇప్పుడు విచిత్రంగా తను పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెడుతున్నానని మీడియా ప్రతినిధులు రావాలని పిలుపునిచ్చారు. కానీ కెమెరాలు మాత్రం తెచ్చుకోవద్దట.

మీడియా లైవ్ లింక్ షేర్ చేస్తామని.. దాన్నే వాడుకోవాలి కానీ.. సొంతంగా వీడియోలు మాత్రం తీయవద్దని ఈ ఆంక్షలు వేధించారు. పైకి మాత్రం… స్పేస్ లేదని కారణం చెబుతున్నారు. వైసీపీ ఆఫీసు అంటే.. గతంలో తాడేపల్లిలో ఉన్న అద్దాల భవనమో.. ఊరూరా కట్టిన ప్యాలెస్‌లో కాదు… జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ధనం కోట్లు పెట్టి ముస్తాబు చేసుకున్న క్యాంప్ ఆఫీసే .. ఇప్పుడా పార్టీ ఆఫీసు. సీఎంగా ఉన్నప్పుడు సమీక్షలు చేసిన ప్లేస్‌లోనే ఇప్పుడు కూర్చుని పార్టీ కోసం పని చేసుకుంటున్నారు.

Read Also :ఛానెల్ ఏర్పాటులో విసారెడ్డి దూకుడు..ఆ వైసీపీ నేతలకు మూడినట్లేనా?

తాడేపల్లిలో ఉన్నదంతా ప్రభుత్వ సామాగ్రినే. ఆయన వైభోగాన్ని ఎక్కడ షూట్ చేసి జనం ముందు పెడతారోనన్న భయంతోనే కెమెరాలను అనుమతించడం లేదు. అత్యంత లగ్జరీగా ఉండేలా.. రూ. కోట్లు పెట్టి సొంత బంధువులతో చేయించుకున్న డిజైన్స్ ఇల్లు.. క్యాంప్ ఆఫీస్ ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close