సాక్షి సరే మరి భారతి సిమెంట్స్ లెక్క ఎంత ?

ఏడాదికి వంద కోట్లు.. ఐదేళ్లకు రూ. ఐదు వందల కోట్ల ప్రజాధనం ఒక్క ప్రకటనల రూపంలోనే సాక్షి ఖాతాకు చేరాయని అధికారికంగా వెల్లడయింది. ఇందు కోసం అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించారు కూడా. సాక్షి పేపర్ కొనడానికి వివిధ ప్రభుత్వ శాఖలు ఎంత ఖర్చు పెట్టాయో.. సాక్షి ఉద్యోగులకు ఇంకా ఎంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చి.జీతాలు ఖాతాల్లో వేశారో అది వేరే లెక్క. ఒక్క సాక్షి మాత్రమే కాదు జగన్ కుటుంబానికి చెందిన మరో కంపెనీ భారతి సిమెంట్స్ కూడా పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని తన ఖాతాల్లో వేసుకుంది.

వైసీపీలో అధికారంలో ఉన్నంత కాలం భారతి సిమెంట్ ను మాత్రమే ప్రభుత్వ సంస్థలు కొన్నాయి. ఇతర సంస్థల కంటే భారత సిమెంట్ కే ఎక్కువ రేటు నిర్ణయించారు. పునాదులు కూడా వేయని ఇళ్లకు భారతి సిమెంట్ సరఫరా చేశారు. స్కూళ్లలో అరకొరగా చేసిన పనులకు భారతి సిమెంట్ నే వాడారు. అధికారులు పూర్తి స్థాయిలో భారతి సిమెంట్ నే వాడేలా చూశారు. ఈ భారతి సిమెంట్ దోపిడీ ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also read : సాక్షిలో వైసీపీ యాడ్స్ – పెద్ద స్కెచ్చే !

ఈ విషయాన్ని ప్రభుత్వం ఇంకా బయట పెట్టలేదు. పెడతారో లేదో తెలియదు కానీ .. జగన్ సీఎంగా ఉన్నప్పుడు మజ్జిగ సరఫరా చేసేందుకు ఓ పది సంస్థలతో పాటు హెరిటేజ్ కూడా కొన్ని ప్యాకెట్ల సరఫరాకు కాంట్రాక్ట్ తీసుకుందని రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు చర్యలు తీసుకున్నా లేకపోయినా.. జగన్ కుటుంబానికి చెందిన సంస్థలకు.. వ్యక్తుల ఖాతాల్లోకి ఎంత ప్రజాధనం వెళ్లిందో బయటపెట్టాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వం పై ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close