వైసీపీ బాటలోనే షర్మిల !

బిర్యానీ పెడతాం అంటే అన్నం పెట్టడం ఆపేయబోతున్నారని ప్రచారం చేసే వైసీపీ మార్క్ ఫేక్ నెరేటివ్స్‌ ఊబిలో షర్మిల కూడా చిక్కుకుంటున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని కేంద్ర ప్రభుత్వ పథకం.. ఆయుష్మాన్ భవను అందరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. వెంటనే వైసీపీ సోషల్ మీడియాలో ఏపీలో ఆరోగ్యశ్రీ రద్దు అనే ప్రచారం ప్రారంభించింది. వీళ్ల ఆత్రం ఇలా ఉందని టీడీపీ సోషల్ మీడియా నిజాన్ని చెప్పేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే.. షర్మిల కూడా రంగంలోకి దిగిపోయారు.

పెమ్మసాని చెప్పిన దాంట్లో ఏదో అర్థం ఉందని.. క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా స్పందించారు. కేంద్రం పథకాల్ని సమర్థంగా వాడుకోవడం అంటే రాష్ట్ర పథకాన్ని ఆపేయడమా అని ప్రశ్నించారు. కేంద్రం ఆయుష్మాన్ భవ పథకాన్ని కూడా ఉపయోగించుకుంటే చాలా మందికి మేలు జరుగుతుందని.. ఏపీ ఆరోగ్యశ్రీ పథకం కొనసాగుతుందని.. అదనపు వైద్య సేవలు అందినట్లే కదా అని క్లారిటీ ఇచ్చారు. ఈ మాత్రం క్లారిటీ పెమ్మసాని మాట్లాడిన మాటలను చూస్తే ఎవరికైనా వస్తుంది.

కానీ ఏదో ఒకటి రాజకీయం చేయాలన్న ఉద్దేశంతో వైసీపీ ఫేక్ నేరేటివ్స్ ప్రారంభిస్తే దాన్ని షర్మిల అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కు సోషల్ మీడియా బలం కొరత ఉండవచ్చు కానీ.. వైసీపీ సోషల్ మీడియాను వాడుకుంటే మాత్రం.. ఫేక్ న్యూస్ లతో బద్నాం అయిపోతారు. ప్రజల్లో చులకన అయిపోతారని కాంగ్రెస్ లోనే సెటైర్లు పడుతున్నాయి. వైసీపీకి, షర్మిలకు తేడా ఏముందనుకునే పరిస్థితి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close