మాస్టర్ ప్లానర్ IPS రంగనాథ్ !

తాడి తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడని సామెత. ప్రతి విషయంలోనూ ఇది రుజువు అవుతూనే ఉంటుంది. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కబ్జా రాయుళ్ల విషయంలో అలాగే కనిపిస్తున్నారు. చెరువుల్ని మింగేసి ఏళ్లు గడుస్తున్నా.. తమ జోలికి ఎవరూ రాకుండాచూసుకుంటున్న వారి ప్లాన్లకు విరుగుడు సరైన పద్దతిలోనే అమలు చేస్తున్నారు. ఆయన వ్యూహాల్ని గుర్తించలేక కబ్జా దారులు కూడా విలవిల్లాడిపోతున్నారు.

ఇప్పటి వరకూ ఎవరూ ఎన్ కన్వెన్షన్ జోలికి వెళ్లలేకపోయిన వైనం

నాగార్జున వైఎస్ హయాంలో ఎన్ కన్వెన్షన్ కట్టారు. కట్టినప్పటి నుంచి వివాదాలే. కానీ రెండు దశాబ్దాలు గడిచినా ఒక్కరూ ఆ కన్వెన్షన్ జోలికి వెళ్లలేకోయారు. రాజకీయ బలం…కోర్టుల్లో పిటిషన్లు బేస్ చేసుకుని అటు వైపు పోకుండా చూసుకున్నారు. ఒక్క ఎన్ కన్వెన్షన్ కాదు… రంగనాథ్ నేతృత్వంలో ఇటీవల కూల్చివేసిన అనేక నిర్మాణాల యజమానులు పలుకుబడి ఉన్నవారే. ముందుగా తెలిస్తే ఏదో ఓ రూపంలో అడ్డుకుని తమ నిర్మాణాలను కాపాడుకునేవారే. ఈ విషయం తెలుసు కాబట్టి.. ఆయా యాజమానులు షాక్ అయ్యేలా.. షాక్ నుంచి తెరుకునేసరికి నేలమట్టమయ్యేలా మెరుపు వేగంతో ప్లాన్లు అమలు చేస్తున్నారు.

ఎలాంటి చాన్స్ ఇవ్వకుండా పక్కాగా కూల్చివేతలు

ముందుగా టార్గెట్ ఫిక్స్ చేసుకుంటున్నారు, బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా రహస్యంగా పూర్తి చేస్తున్నారు. యాక్షన్ లోకి దిగే రోజున ఉదయమే ఎంట్రీ ఇస్తున్నారు. ఎలాంటి కట్టడం అయినా మూడు, నాలుగు గంటల్లో కూల్చివేత పూర్తి చేస్తున్నారు. ఎవరూ కూల్చివేత ల వద్దకు రాలేకపోతున్నారు. ఆయా యజమానులు ఏం చేయాలా అని కిందా మీదా పడి నిర్ణయం తీసుకునేలోపు పని అయిపోతుంది. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అప్పటికే కూలిపోయి ఉంటుంది.

నెక్ట్స్ ఎవరో అని నిద్రలేని బీఆర్ఎస్ నేతలు

ఐపీఎస్ అధికారి రంగనాథ్ ఈ వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఆయన దెబ్బకు ఆక్రమణ దారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నాగార్జున తరవాత ఇప్పుడు మల్లారెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి వంటి వారికి కంటి మీద కునుకులేకుండా పోయింది. యూనివర్శిటీల పేరుతో వీరు కుంటల్ని .. చెరువుల్ని మింగేసి కట్టడాలు చేశారు. బహుశా వచ్చే వారం వీరికి ముహుర్తం ఉండవచ్చు. అందుకే ముందస్తుగా హైకోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close