ఖుషీ 2 మొద‌లైపోయింది

ప్ర‌స్తుతం స‌ర్దార్ – గ‌బ్బ‌ర్ సింగ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు ప‌వ‌న్ క‌ల్యాణ్ . ఆ త‌ర‌వాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా త‌న త‌దుప‌రి సినిమాని ప‌ట్టాలెక్కించేయాల‌ని కృత నిశ్చ‌యంతో ఉన్నాడు. ఇటీవ‌ల కొన్ని క‌థ‌ల్ని విన్న ప‌వ‌న్‌… ఖుషీ ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య తో ఓ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అయ్యాడ‌ని టాక్‌. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన వేదాళం రీమేక్ ని ఎస్‌.జె సూర్య‌కి అప్ప‌గించాడు ప‌వ‌న్‌. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన ప‌నులూ మొద‌లైపోయాయి.

ఇటీవ‌ల ముంబైలో ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్ జ‌రిగాయి. అనూప్ సంగీత సార‌ధ్యంలో గీత ర‌చ‌యిత రామ‌జోగయ్య శాస్త్రి, సూర్య క‌ల‌సి పాట‌ల కోసం క‌స‌ర‌త్తులు మొద‌లెట్టాశారు. ఇప్ప‌టికే రెండు పాట‌లు ఓకే అయిపోయాట‌. స‌ర్దార్ అవ్వ‌గానే.. ఓ నెల రోజులు విరామం తీసుకొని, వెంట‌నే వేదాళం రీమేక్ ని మొద‌లెట్టాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడ‌ని స‌మాచారం. ఈ యేడాది ఆఖ‌రుక‌ల్లా… ఈ రీమేక్ ని పూర్తి చేస్తార‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దువ్వాడ హీరోగా “వాలంటీర్” – నిర్మాత దివ్వెల !

కళా పోషకురాలు అయిన దివ్వెల మాధురీ తన రాజా దువ్వాడ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా ను నిర్మించారు. ఆ సినిమా పేరు వాలంటీర్. క్యాచీగా ఉన్న టైటిల్ గా .....

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి క‌ల్తీ… స్పందించిన రాహుల్ గాంధీ

తిర‌మల వెంక‌న్న ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యి క‌ల్తీ అయ్యింద‌ని, అందులో జంతువుల కొవ్వు అవ‌శేషాలున్న‌ట్లు తేల‌టంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్తం అవుతోంది. ఈ విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అంద‌రూ డిమాండ్...

ఆదిమూలం కేసు అలా సెటిల్ – సస్పెన్షన్ ఎత్తేస్తారా ?

టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై ఓ మహిళ చేసిన ఆరోపణల కేసు తేలిపోయింది. తాము రాజీకి వచ్చామని కేసు అవసరం లేదని ఆ మహిళ నేరుగా హైకోర్టుకు వచ్చి చెప్పింది. దీంతో హైకోర్టు కూడా...

హైదరాబాద్‌లో 18 శాతం పెరిగిన ఇళ్ల డిమాండ్

ఏపీలో టీడీపీ గెలవడం, హైడ్రా ఎఫెక్ట్ కారణంగా హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని జరుగుతున్న ప్రచారానికి వాస్తవనికి హస్తిమశకాంతరం ఉందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. హైడ్రా దూకుడు చూపించిన ఆగస్టు నెలలో రూ. 4...

HOT NEWS

css.php
[X] Close
[X] Close