క్రూడాయిల్ ధ‌ర‌లు త‌గ్గినా… పెట్రోల్ రేట్లు త‌గ్గించ‌రా?

అంత‌ర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. అయినా, మ‌న కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప్ర‌జ‌ల మీద క‌నిక‌రం లేదు. సామాన్యుడికి గుదిబండ‌ల మారిన పెట్రోల్, డీజిల్ రేట్ల‌ను త‌గ్గించాల‌న్న క‌నీస ఆలోచ‌న కూడా చేయ‌టం లేదు.

ఇత‌ర దేశాల‌తో పోల్చితే మ‌న దేశంలోనే పెట్రోల్, డీజిల్ పై ప‌న్నుల శాతం అధికం. అందుకే దాన్ని జీఎస్టీ ప‌రిధిలోకి తీసుక‌రాలేదు. అయితే, అంత‌ర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ రేట్లు పెరిగిన వెంట‌నే రేట్లు పెంచేసే ఆయిల్ కంపెనీలు, త‌గ్గిన‌ప్పుడు మాత్రం త‌గ్గించేందుకు క‌నీస ప్ర‌య‌త్నం కూడా చేయ‌వు.

అంత‌ర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ క్రూడాయిల్ ధ‌ర 70డాల‌ర్ల దిగువ‌కు ప‌డిపోయింది. ఇది దాదాపు 9నెల‌ల కనిష్ట స్థాయి. అయినా రేట్లు ఏమాత్రం త‌గ్గించ‌టం లేదు. గ‌డిచిన ప‌ది సంవ‌త్స‌రాల్లో పెట్రోల్ పై వంద శాతంకు పైగా ఎక్సైజ్ డ్యూటీ పెంచ‌గా, డీజిల్ పై 300శాతంకు పైగా పెరిగింది. ఫ‌లితంగా రేట్లు దాదాపు 30 రూపాయ‌ల‌కు పైగా పెరిగిపోయాయి. దీంతో స‌గ‌టు వేత‌న జీవితో పాటు నిత్య‌వ‌స‌రాల ధ‌ర‌లకు రెక్క‌లు వ‌చ్చాయి.

అయితే, క్రూడాయిల్ ధ‌ర‌లు త‌గ్గటంతో ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌ని ఆయిల్ కంపెనీలు… కొన్ని రోజులుగా పాత ధ‌ర‌ల‌నే కొన‌సాగిస్తూ వ‌స్తున్నాయి. అయితే, త్వ‌ర‌లోనే పలు రాష్ట్రాల్లో ఎన్నిక‌లున్న నేప‌థ్యంలో, పెట్రోల్-డీజిల్ రేట్ల‌ను త‌గ్గించే అవ‌కాశం ఉన్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష 2’ సెట్లో గొడ‌వ జ‌రిగిందా?

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. జానీ మాస్ట‌ర్‌కూ బాధితురాలికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని ఓ పెద్ద హీరో ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుకుమార్...

ఆ ప్రజాగ్రహ ఓటులోనే బూడిదయ్యారు జగన్ గారూ !

జగన్ రెడ్డి ఓడిపోయినా ఇసుమంత కూడా మారలేదని తనను వదిలి పోతున్న పార్టీ నేతల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. ఎవరు పోయినా పర్వాలేదని.. ప్రజల...

కుక్కలకు వల వేశారు.. కాంతి రాణా కోర్టుకెళ్లారు !

హీరోయిన్ జెత్వానీ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డెహ్రాడూన్ లో దాక్కుని తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న ఆయనపై నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు....

బీజేపీ నేతలు మనుషులైతే చంద్రబాబును తిట్టాలి : జగన్

జగన్ రెడ్డి బీజేపీ నేతలకు పెద్ద టెస్టే పెట్టారు. బీజేపీ నేతలు .. మనషులు అయితే చంద్రబాబును తిట్టాలట. బహుశా.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు .. తనకు గిలిగింతలు పెట్టడానికి అందరూ తిట్టారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close