చెరువు జాగ్రత్తల్లో హైదరాబాద్ ఇళ్ల కొనుగోలుదారులు !

హైదరాబాద్‌లో ఇళ్లు కొనాలనుకునేవారు కొత్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లేక్ వ్యూ అని ఆశపడకుండా… అసలే లేక్ కు ఎంత దూరంలో తమ ఇల్లు ఉందో ఆరా తీసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇళ్ల కొనుగోలు చేసిన వారికి.. కొనుగోలు చేయాలనుకునేవారికి అవగాహన కల్పించేందుకు హెచ్‌ఎండీఏ https://lakes.hmda.gov.in/పేరుతో వెబ్ సైట్ పెట్టి అందులో అన్ని చెరువుల వివరాలను పెట్టింది. ఫుల్ ట్యాంక్ లెవల్.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ వంటి వాటినీ మార్క్ చేసి ఉంచారు. ఆ పరిధిలో కి ఇళ్లు ఉన్నా.. అమ్మకానికి ఆఫర్ ఇచ్చినవి ఉన్నా ఆశలు వదిలేసుకోవడం మంచిది.

హైడ్రా దూకుడు తర్వాత ఈ వివరాలు సరి చూసుకుని చాలా మంది కొత్త ప్రాజెక్టుల్లో ఒప్పందాలను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అమీన్ పూర్ పరిధిలో చెరువుల తూముల్ని ఆక్రమించి హైరైజ్ అపార్టుమెంట్లు కడుతున్న ఓ కంపెనీకి సగానికి పైగా బుకింగ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇతర చోట్ల కూడా అంతే. ప్రజల్లో ఈ మాత్రం చైతన్యం రావడం ఎంతో మంచిదన్న అభిప్రాయం రియల్ ఎస్టేట్ నిపుణుల్లోనూ వ్యక్తమవుతోంది.

సాధారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు రాజకీయ బలంతో… లంచాలు ఇచ్చి చెరువుల్లో కట్టడాలు పూర్తి చేసిసామాన్యులకు అమ్మేస్తూంటాయి. దాని వల్ల కబ్జాదారులు బాగుపడుతున్నారు కానీ.. వాటిని కొన్న సామాన్యులు మాత్రం తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కొత్త బాధితులు రాకుండా ఉండేందుకు హైడ్రా చేపట్టిన చర్యలు బాగా ఉపయోగపడుతున్నాయి.

ఇక నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా తమ ప్రాజెక్టు చెరువుకు ఎంత దూరమో.. ఫుల్ ట్యాంక్ లెవర్.. బఫర్ జోన్ పరిధిలోకి ఎలా రావో చెబుతూ.. ప్రత్యేకమైన బ్రోచర్లను కస్టమర్లకు పంచాల్సిన పరిస్థితి వచ్చిందని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close