జెత్వానీ కేసులో అప్రూవర్లుగా పోలీసులు !

హీరోయిన్ జెత్వానీపై పక్కాగా తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశామని పోలీసులు అనుకుంటున్నారు కానీ… తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ఓ భ్రమలో అనేక తప్పులు చేశారు. అందులో మొదటిది ముందుగానే విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవడం. జెత్వానీపై ఉదయం కేసు వస్తే సాయంత్రం… బెటాలియన్ ను తీసుకునే వెళ్లిపోయారు విశాల్ గున్ని సహా ఇతర అధికారులు. ఓ మహిళను.. అదీ కూడా రూ. ఐదు లక్షల చీటింగ్ కేసులో అరెస్టు చేయడానికి దాదాపుగా రెండు లక్షలు పెట్టి ఫిర్యాదు అందడానికి ముందు రోజే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అది రికార్డెడ్.

ముంబైలో వారు ఉన్న హోటల్.. తిరిగిన కార్ల గురించి పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చింది. జెత్వానీ పోలీసు అధికారులపై ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి నివేదికను డీజీపీకి సమర్పించారు. ఇందులో తప్పుడు ఫిర్యాదులు చేయించి తప్పుడు కేసులు పెట్టించారని ఆధారాలతో సహా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. విద్యాసాగర్ చెప్పిన వ్యక్తి తమకు జెత్వానీ భూమి అమ్మలేదని చెప్పడం, ఫిర్యాదు కంటే ముందే ముంబైకి టిక్కెట్లు చేసుకోవడం.. జెత్వానీ పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడంతో పాటు విజయవాడలో అనధికారికంగా నిర్బంధించి వేధించడం వరకూ అన్ని అంశాలనూ ఆ నివేదికలో అందించారు.

ఈ నివేదిక ప్రకారం పీఎస్ఆర్ ఆంజనేయలు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై కేసులు నమోదు చేసి తీవ్రమైన అభియోగాలు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వారికి అతిపెద్ద మైనస్ ఏమిటంటే… ఈ ఐపీఎస్ అధికారులతో పాటు ఈ తప్పుడు కేసులో భాగమైన వారంతా… అసలేం జరిగిందో చెప్పేయడం. వారంతా అప్రూవర్లుగా మారిపోవడం. వారు చేసిన తప్పుడు పనులకు తాము బలి కావాలనుకోవడం లేదని వారు తేల్చేసుకున్నారు. దీంతో ఈ దారి తప్పి ఐపీఎస్‌లకు ఎండ్ కార్డ్ పడేందుకు మార్గం సుగమం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌న‌సేన‌లోకి బాలినేని… జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాను ఏనాడూ ఏదీ ఆశించ‌కుండా, మంత్రిప‌ద‌విని సైతం వ‌దులుకొని జ‌గ‌న్ వెంట న‌డిస్తే... నాపై ఇష్టం వ‌చ్చినట్లు మాట్లాడిస్తున్నా ప‌ట్టించుకోలేద‌ని మాజీ మంత్రి బాలినేని మండిప‌డ్డారు. జ‌గ‌న్ వెంట‌నే క‌ష్ట‌కాలంలో న‌డిచిన 17మంది...

కిల్’ రీమేక్‌: ఏ స్టూడియోస్ + ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌

బాలీవుడ్ లో ఘ‌న విజ‌యాన్ని అందుకొన్న సినిమా 'కిల్‌'. తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తార‌ని కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బ‌డా బ‌డా నిర్మాణ సంస్థ‌లు రీమేక్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి....

ఎక్స్‌క్లూజీవ్‌: గ‌ప్ చుప్ గా ప్ర‌భాస్ సినిమా

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబోలో ఓ సినిమా ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. బుధ‌వారం నుంచే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది....

నాగ‌బాబు ట్వీట్… జానీ మాస్ట‌ర్ ఇష్యూ మీదేనా?

జ‌న‌సేన నేత‌, ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ పై లైంగిక ఆరోప‌ణ‌లు రాగా కేసులు కూడా న‌మోద‌య్యాయి. ప‌రారీలో ఉన్న జానీ మాస్ట‌ర్ ను సైబ‌రాబాద్ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close