రైతు భరోసాపై సర్కార్ కీలక ప్రకటన

రెండు లక్షల రుణమాఫీ పేరుతో హడావిడి చేసి రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ పదేపదే విమర్శలు చేస్తోంది. రైతు భరోసాను ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఎవరికి రైతు భరోసా ద్వారా ఆర్థిక సాయం చేయనున్నారు? అనే అంశాలపై స్పష్టత ఇవ్వకుండా సర్కార్ కాలయాపన చేస్తోందని ఫైర్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పంటలు పండించే రైతులకే రైతు భరోసా ద్వారా ఆర్థిక సాయం చేయనున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరి కొండలకు , గుట్టలకు రైతు భరోసా ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు. అయితే, ఎప్పటి నుంచి ఇస్తారు అనే దానిపై క్లారిటీ ఇవ్వకపోయినా.. దసరా తర్వాత అంటే వచ్చే నెలాఖరులోపు రైతుభరోసా పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

ఈసారి ఐదు ఎకరాలకా లేక పది ఎకరాలు ఉన్న వారికి ఈ రైతు భరోసాను వర్తింపజేయాలా? అనే విషయంలో ప్రభుత్వం ఎటు తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. పేద రైతుకు మేలు చేయాలనే సర్కార్ భావిస్తుండటంతో ఐదు ఎకరాలకు రైతు భరోసాను వర్తింపజేయాలి అని తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ఇప్పటివరకూ ఉన్న లెక్కల ప్రకారం మొత్తం 1.52 కోట్ల ఎకరాలకు రూ.22,800 కోట్లు అవుతుంది. అదే 5 ఎకరాలకే రైతు భరోసాను పరిమితం చేస్తే, అప్పుడు 62.34 లక్షల మంది రైతులకు ఈ సాయం అందుతుంది. రైతుల సంఖ్య తక్కువ అయినా.. ప్రతీ పేద రైతుకు గత ప్రభుత్వం కంటే అదనంగా 5000ఎక్కువ ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌న‌సేన‌లోకి బాలినేని… జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాను ఏనాడూ ఏదీ ఆశించ‌కుండా, మంత్రిప‌ద‌విని సైతం వ‌దులుకొని జ‌గ‌న్ వెంట న‌డిస్తే... నాపై ఇష్టం వ‌చ్చినట్లు మాట్లాడిస్తున్నా ప‌ట్టించుకోలేద‌ని మాజీ మంత్రి బాలినేని మండిప‌డ్డారు. జ‌గ‌న్ వెంట‌నే క‌ష్ట‌కాలంలో న‌డిచిన 17మంది...

కిల్’ రీమేక్‌: ఏ స్టూడియోస్ + ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌

బాలీవుడ్ లో ఘ‌న విజ‌యాన్ని అందుకొన్న సినిమా 'కిల్‌'. తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తార‌ని కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బ‌డా బ‌డా నిర్మాణ సంస్థ‌లు రీమేక్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి....

ఎక్స్‌క్లూజీవ్‌: గ‌ప్ చుప్ గా ప్ర‌భాస్ సినిమా

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబోలో ఓ సినిమా ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. బుధ‌వారం నుంచే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది....

నాగ‌బాబు ట్వీట్… జానీ మాస్ట‌ర్ ఇష్యూ మీదేనా?

జ‌న‌సేన నేత‌, ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ పై లైంగిక ఆరోప‌ణ‌లు రాగా కేసులు కూడా న‌మోద‌య్యాయి. ప‌రారీలో ఉన్న జానీ మాస్ట‌ర్ ను సైబ‌రాబాద్ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close